Telangana

డిజిటల్ హ్యుమానిటీస్ పై అధ్యాపక వికాస కార్యక్రమం

గీతంలో ప్రారంభమైన మూడు రోజుల కార్యక్రమం

తమ నైపుణ్యాలను పంచుకుంటున్న జాదవ్ పూర్ వర్సిటీ, ఐఐటీ ఢిల్లీ అధ్యాపకులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని ఆంగ్లం, ఇతర భాషల విభాగం ఆధ్వర్యంలో ‘డిజిటల్ హ్యుమానిటీస్’పై నిర్వహిస్తున్న మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం (ఎఫ్డీపీ) సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. సాంప్రదాయ మానవీయ శాస్త్రాలను (హ్యుమానిటీస్) అభివృద్ధి చెందుతున్న డిజిటల్ టెక్నాలజీలతో అనుసంధానించే కీలక సాధనాలు – వచనం (టెక్ట్), శ్రవణం (ఆడియో) వంటి వాటిని డిజిటలైజేషన్ చేయడం, మెటాడేటా సృష్టి, నిర్వహణ, డేటా విజువలైజేషన్, టెక్స్ట్ విశ్లేషణలో అధ్యాపక సభ్యులకు ఆచరణాత్మక శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమ లక్ష్యం.ప్రారంభ కార్యక్రమంలో జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంకు చెందిన ప్రముఖ ప్రొఫెసర్లు చాలా లోతైన, ఆలోచింపజేసే ప్రసంగాలు చేశారు.

స్కూల్ ఆఫ్ కల్చరల్ టెక్స్ట్ అండ్ రికార్డ్స్ (ఎస్ సీటీఆర్) డైరెక్టర్ ప్రొఫెసర్ అభిజిత్ గుప్తా, డిజిటల్ సంరక్షణలో తన విస్తృత అనుభవాన్ని పంచుకుంటూ డిజిటైజేషన్ చేసి, వాటిని భవిష్యత్తు తరాలకు పనికొచ్చేలా సంరక్షించడం (ఆర్కైవింగ్): ఎస్ సీటీఆర్ ప్రయాణం అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. ఎస్ సీటీఆర్ లోని రిప్రోగ్రాఫర్ డాక్టర్ అమృతేష్ బిశ్వాస్ ‘జ్జానాన్ని సంగ్రహించడం: ఫోటోగ్రఫీ, డిజిటలైజేషన్, డిజిటల్ ఆర్కైవ్ లను నిర్మించడం’, ‘వినగల గతాన్ని కాపాడటం: సౌండ్ ఆర్కైవింగ్, డిజిటలైజేషన్’ అనే అంశాలపై చాలా విలువైన విషయాలను సదస్యులతో పంచుకున్నారు.తొలుత, జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ తరు స్వాగత వచనాలతో ఆరంభమైన ఈ కార్యక్రమంలో ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ సయంతన్ మండల్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు.

ఇక రానున్న రెండు రోజులలో ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ అర్జున్ ఘోష్, జాదవ్ పూర్ వర్సిటీ ఎస్ సీటీఆర్ పరిశోధక విద్యార్థిని రీసూమ్ పాల్ వంటి ప్రముఖ వక్తలు తమ నైపుణ్యం, ఆచరణాత్మక అంతర్దృష్టులను పంచుకోనున్నారు. ఈ మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని నిర్వాహకులు డాక్టర్ జోంధలే రాహుల్ హిరామన్, డాక్టర్ బనేకర్ తుషార్ వినాయక్, డాక్టర్ రెస్మి పాడియన్ ల మద్దతుతో డాక్టర్ సయంతన్ మండల్ సమన్వయం చేస్తున్నారు.గత ఏడాది డిజిటల్ హ్యుమానిటీస్ పై నిర్వహించిన అధ్యాపక వికాస కార్యక్రమానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. డిజిటల్ యుగంలో విద్యా ఆవిష్కరణ, అంతర్ విభాగ నైపుణ్యాలను పెంపొందించడంలో గీతం యొక్క నిరంతర నిబద్ధతను ఈ ఎఫ్డీపీ ప్రతిబింబిస్తోంది.

admin

Recent Posts

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

6 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

9 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

2 days ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago