Telangana

గీతంలో విజయవంతంగా ముగిసిన టెక్ ఫెస్ట్ జోనల్స్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) బాంబే సహకారంతో హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఆసియాలోనే అతి పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్ – టెక్ ఫెస్ట్, ఐఐటీ బాంబే యొక్క ప్రాంతీయ రౌండ్ అయిన టెక్ ఫెస్ట్ హైదరాబాద్ జోనల్స్ 2025ను విజయవంతంగా నిర్వహించింది. గీతంలోని ఈఈసీఈ విభాగంతో పాటు జీ-ఎలక్ట్రా (స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్) నిర్వహించిన ఈ టెక్ ఫెస్ట్ జోనల్స్ పోటీలు విద్యార్థులలో ఆవిష్కరణ, సమస్య పరిష్కారం, సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో వారి నైపుణ్యాలు, సృజనాత్మకతను ప్రదర్శించడానికి జాతీయ వేదికను అందించారు.

హైదరాబాదు ఎడిషన్ లో నాలుగు ప్రధాన పోటీలు జరగ్గా, ఈ ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
 కోడ్ కోడ్: ఆన్ లైన్ కోడింగ్ ఛాలెంజ్ (తొమ్మిదో తరగతి నుంచి ఇంజనీరింగ్ చివరి ఏడాది విద్యార్థుల వరకు)
 మెష్ మెరైజ్: లైన్ ఫాలోవర్ రోబోటిక్స్ ఛాలెంజ్
 కోజ్మో క్లెంచ్: పిక్ అండ్ ప్లేస్ మాన్యువల్ నియంత్రించే కంట్రోల్డ్ బాట్ పోటీ
 టీఎఫ్ వో (టెక్ ఫెస్ట్ ఒలింపియాడ్): పాఠశాల విద్యార్థుల కోసం టెక్నికల్ క్విజ్ (8-10 తరగతులు)

గీతంలోని ఆరుగురు అధ్యాపకులు, 40 మంది విద్యార్థి వాలంటీర్లు, ఇద్దరు సాంకేతిక సిబ్బంది సమన్వయంలో దాదాపు 400 మందికి పైగా ఔత్సాహిక విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలు అసాధారణమైన సృజనాత్మకత, బృంద కృషి, ఆవిష్కరణలను ప్రదర్శించి విజయవంతంగా ముగిశాయి. ఇందులో పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు.స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి. మాధవిల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని, అధ్యాపకులు ఎం.నరేష్ కుమార్, బి. బాలాజీ నాయక్ సమన్వయం చేశారు. విద్యార్థి సమన్వయకర్తలు ఎం.గౌరీశంకర్, ఎ.వేణురెడ్డి తదితరులు అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించి, విజయవంతం చేయడానికి కృషి చేశారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

59 minutes ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago