Telangana

డిజిటల్ హ్యుమానిటీస్ పై అధ్యాపక వికాస కార్యక్రమం

గీతంలో ప్రారంభమైన మూడు రోజుల కార్యక్రమం

తమ నైపుణ్యాలను పంచుకుంటున్న జాదవ్ పూర్ వర్సిటీ, ఐఐటీ ఢిల్లీ అధ్యాపకులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని ఆంగ్లం, ఇతర భాషల విభాగం ఆధ్వర్యంలో ‘డిజిటల్ హ్యుమానిటీస్’పై నిర్వహిస్తున్న మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం (ఎఫ్డీపీ) సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. సాంప్రదాయ మానవీయ శాస్త్రాలను (హ్యుమానిటీస్) అభివృద్ధి చెందుతున్న డిజిటల్ టెక్నాలజీలతో అనుసంధానించే కీలక సాధనాలు – వచనం (టెక్ట్), శ్రవణం (ఆడియో) వంటి వాటిని డిజిటలైజేషన్ చేయడం, మెటాడేటా సృష్టి, నిర్వహణ, డేటా విజువలైజేషన్, టెక్స్ట్ విశ్లేషణలో అధ్యాపక సభ్యులకు ఆచరణాత్మక శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమ లక్ష్యం.ప్రారంభ కార్యక్రమంలో జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంకు చెందిన ప్రముఖ ప్రొఫెసర్లు చాలా లోతైన, ఆలోచింపజేసే ప్రసంగాలు చేశారు.

స్కూల్ ఆఫ్ కల్చరల్ టెక్స్ట్ అండ్ రికార్డ్స్ (ఎస్ సీటీఆర్) డైరెక్టర్ ప్రొఫెసర్ అభిజిత్ గుప్తా, డిజిటల్ సంరక్షణలో తన విస్తృత అనుభవాన్ని పంచుకుంటూ డిజిటైజేషన్ చేసి, వాటిని భవిష్యత్తు తరాలకు పనికొచ్చేలా సంరక్షించడం (ఆర్కైవింగ్): ఎస్ సీటీఆర్ ప్రయాణం అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. ఎస్ సీటీఆర్ లోని రిప్రోగ్రాఫర్ డాక్టర్ అమృతేష్ బిశ్వాస్ ‘జ్జానాన్ని సంగ్రహించడం: ఫోటోగ్రఫీ, డిజిటలైజేషన్, డిజిటల్ ఆర్కైవ్ లను నిర్మించడం’, ‘వినగల గతాన్ని కాపాడటం: సౌండ్ ఆర్కైవింగ్, డిజిటలైజేషన్’ అనే అంశాలపై చాలా విలువైన విషయాలను సదస్యులతో పంచుకున్నారు.తొలుత, జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ తరు స్వాగత వచనాలతో ఆరంభమైన ఈ కార్యక్రమంలో ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ సయంతన్ మండల్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు.

ఇక రానున్న రెండు రోజులలో ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ అర్జున్ ఘోష్, జాదవ్ పూర్ వర్సిటీ ఎస్ సీటీఆర్ పరిశోధక విద్యార్థిని రీసూమ్ పాల్ వంటి ప్రముఖ వక్తలు తమ నైపుణ్యం, ఆచరణాత్మక అంతర్దృష్టులను పంచుకోనున్నారు. ఈ మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని నిర్వాహకులు డాక్టర్ జోంధలే రాహుల్ హిరామన్, డాక్టర్ బనేకర్ తుషార్ వినాయక్, డాక్టర్ రెస్మి పాడియన్ ల మద్దతుతో డాక్టర్ సయంతన్ మండల్ సమన్వయం చేస్తున్నారు.గత ఏడాది డిజిటల్ హ్యుమానిటీస్ పై నిర్వహించిన అధ్యాపక వికాస కార్యక్రమానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. డిజిటల్ యుగంలో విద్యా ఆవిష్కరణ, అంతర్ విభాగ నైపుణ్యాలను పెంపొందించడంలో గీతం యొక్క నిరంతర నిబద్ధతను ఈ ఎఫ్డీపీ ప్రతిబింబిస్తోంది.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago