Telangana

5జీ టెక్నాలజీపై గీతమ్ లో అధ్యాపక వికాస కార్యక్రమం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘5జీ టెక్నాలజీ, ఆసెనై పురోగతి’ అని అంశంపై ఈనెల 8-9 తేదీలలో అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్ ఢీపీ ) నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆ విభాగాధిపతి ప్రొఫెసర్ మాధవి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. 5జీ టెక్నాలజీలో తాజా పరిణామాలు, అధునాతన కమ్యూనికేషన్ టెక్నాలజీ పరిశోధనకు అవకాశాలను తెలియజేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 5జీ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో తమ పరిశోధనా సామర్థ్యాలను పెంచుకోవడానికి అధ్యాపకులు, పీహెచ్ డీ రీసెర్చ్ స్కాలర్లు, పీజీ విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు. తమ పరిశోధనా ప్రాంతాలలో 5జీ / 6జీ సాంకేతికతను వర్తింపజేయడానికి, 5జీ / 6 జీకి మించిన రోడ్- మ్యాప్ పై లోతెన అవగాహన పొందేందుకు ఇందులో పాల్గొనే వారికి అవకాశం ఉంటుందని డాక్టర్ మాధవి వివరించారు. ఈ ఉచిత ఎఫ్ ఢీపీలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను ఈనెల 7వ తేదీలోగా నమోదు చేసుకోవాలని, 50 మంది మాత్రమే అవకాశం ఉంటుందని, ముందు వచ్చిన వారి తొలి ప్రాధాన్యం పద్ధతిలో అవకాశం కల్పిస్తామన్నారు. అవసరమైన వారికి నామమాత్రపు ధరకే గీతం హాస్టళ్లలో వసతి కల్పిస్తామని, అయితే ఆ విషయాన్ని నిర్వాహకులకు ముందుగా తెలియజేయాలని ఆమె స్పష్టీకరించారు.మరింత సమాచారం కోసం ఎఫ్ఎపీ సమన్వయకర్త ఎం.రఘుపతి (94415 44079)ని సంప్రదించాలని,లేదా rmangala@gitam.eduకు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.

admin

Recent Posts

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…

14 hours ago

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

1 day ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

1 day ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

1 day ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

1 day ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

2 days ago