– జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యురాలు డాక్టర్ సునీత
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు పట్టణంలోని డాక్టర్ అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంటర్ప్రైన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ వారి ఆధ్వర్యంలో తేనెటీగల సాగు, దాని యొక్క వాణిజ్య ఉపయోగాలు అనే అంశంపై బుధవారం విద్యార్థులకు సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యురాలు డాక్టర్ సునీత ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ… తేనెటీగల జాతి అంతం జరిగితే మానవ మనుగడకు ప్రమాదం అని గుర్తు చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. పర్యావరణ అనుకూల వ్యాపారాలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. తేనె పెంపకంలో వెలువడే మైనం, ప్రోపోలిస్ యొక్క ఆదాయ వనరుల అవకాశాలను, ఈ కార్యక్రమ నిర్వాహణ కర్త వీరేందర్ విద్యార్థులకు వివరించారు. తక్కువ వ్యవధి, పెట్టుబడితో చేయగల తేనెటీగల పెంపకం ఎంతో ఉపయోగకరమని వైస్ ప్రిన్సిపాల్ అల్లం రెడ్డి అభిప్రాయపడ్డారు. పరపరార్గ సంపర్కం వలన పంటలలో అధిక దిగుబడి పొందవచ్చు అని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ ఉదయ్, డాక్టర్ స్నేహలత, కళాశాల ఆచార్యులు డాక్టర్ రాజిరెడ్డి, రాధిక, కృష్ణ, రవీందర్, హరిత, జానయ్య, స్వప్న, డాక్టర్ భగ్గు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…