– జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యురాలు డాక్టర్ సునీత
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు పట్టణంలోని డాక్టర్ అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంటర్ప్రైన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ వారి ఆధ్వర్యంలో తేనెటీగల సాగు, దాని యొక్క వాణిజ్య ఉపయోగాలు అనే అంశంపై బుధవారం విద్యార్థులకు సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యురాలు డాక్టర్ సునీత ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ… తేనెటీగల జాతి అంతం జరిగితే మానవ మనుగడకు ప్రమాదం అని గుర్తు చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. పర్యావరణ అనుకూల వ్యాపారాలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. తేనె పెంపకంలో వెలువడే మైనం, ప్రోపోలిస్ యొక్క ఆదాయ వనరుల అవకాశాలను, ఈ కార్యక్రమ నిర్వాహణ కర్త వీరేందర్ విద్యార్థులకు వివరించారు. తక్కువ వ్యవధి, పెట్టుబడితో చేయగల తేనెటీగల పెంపకం ఎంతో ఉపయోగకరమని వైస్ ప్రిన్సిపాల్ అల్లం రెడ్డి అభిప్రాయపడ్డారు. పరపరార్గ సంపర్కం వలన పంటలలో అధిక దిగుబడి పొందవచ్చు అని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ ఉదయ్, డాక్టర్ స్నేహలత, కళాశాల ఆచార్యులు డాక్టర్ రాజిరెడ్డి, రాధిక, కృష్ణ, రవీందర్, హరిత, జానయ్య, స్వప్న, డాక్టర్ భగ్గు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…