Telangana

కబ్జాదారుల హెచ్చరికలు

_అధికారుల మౌనం పై అధికారులకు పిర్యాదు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి మండల పరిధిలో ని గంగారం పెద్ద చెరువు ను అన్నివైపుల నుండి ఆక్రమణకు గురి కావడం, ఆక్రమణ దారుల హెచ్చరిక నోటీసులపై అధికారుల మౌనంపై దర్యాప్తు చేపట్టి చెరువు రక్షణకై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జనం కోసం అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్ డి ఓ, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ తొ పాటు చందానగర్ సర్కిల్ అధికారులకు పిర్యాదు చేశాడు.అభివృద్ధి పేరు మీద చుక్క నీరు లేకుండా చేసి 8 ఏండ్లు దాటిపోయిందని, ఓవైపు అభివృద్ధి పనుల తాత్సారంతో చుక్కనీరు లేకపోగా పెద్ద పెద్ద సంస్థల నిర్మాణాలు చెరువును ఆక్రమిస్తూ వాటి డ్రైనేజీని సైతం చెరువులోకి వదలుతూ ‘లేక్ బ్రీజ్’ ల పేరుతో కోట్లలో వ్యాపారాలు చేసుకుంటున్నాయని పిర్యాదు లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కళ్లు మూసుకొని చెరువుల్లోనే అనుమతులు ఇచ్చి, రెవెన్యూ వాళ్లు చెరువు అని లేఖలు రాసి ఇద్దరూ కలిసి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి చెరువులో నిర్మాణాలు జరుగుతుంటే చూస్తూ మిన్నకుండి పోయారని తెలిపారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 21, శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం అధికారుల వైఫల్యాన్ని నిరూపించడానికి ‘జనం కోసం’ సిద్ధంగా ఉందని, ఉన్నతస్థాయి అధికారి ద్వారా దర్యాప్తు జరిపించాలని, నిజాన్ని నిరూపిస్తామన్నారు. రెండుసార్లు కూల్చివేస్తే తిరిగి గుడిసె వేసి చెరువులోనే హెచ్చరిక బోర్డు పెట్టడం విచిత్రం. చెరువు కబ్జాను వెంటనే తొలగించి, గంగారం పెద్ద చెరువును పునరుద్ధరించాలని ‘జనం కోసం’ డిమాండ్ చేస్తుo దన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago