Telangana

గీతంలో నేటి నుండి ప్రమాణ 2024 ఫెస్ట్

_గీతమ్ లో మొద‌లైన ప్రమాణ సందడి 

_ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు అలరించనున్న సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హైద‌రాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రతియేటా నిర్వహించే మూడు రోజుల సాంకేతిక, సాంస్కృ తిక పండుగ ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు అలరించనున్నది. ఈ విషయాన్ని స్టూడెంట్ లైఫ్ ప్రతినిధులు వెల్లడించారు. విద్యార్థులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంలో విభిన్నమైన సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాల మేలు కలయికగా సాగుతుందని, వేలాది మంది విద్యార్థులను ఈ ఫెస్ట్ ఆకర్షించడమే గాక వారిలోని ప్రతిభ, నైపుణ్యం, సాంస్కృతిక వినోదాన్ని ప్రదర్శించే వేదికగా ఉపకరిస్తుందన్నారు. ప్రమాణ-2024 ప్రచారంలో భాగంగా విద్యార్థులు ఫ్లాష్ మాబ్ ను నిర్వహించడంతో పాటు పలు కళాశాలలకు ఈ సమాచారాన్ని చేరవేసినట్టు వారు వివరించారు. ఇప్పటికే పలు సాంకేతిక కార్యక్రమాలు, వ‌ర్క్ షాప్ లు నిర్వహించామ‌ని పాల్గొన్న విద్యార్థులందరికీ ధ్రువీకరణ పత్రాలను అందజేశామన్నారు. అపోలో ఆస్పత్రుల సామాజిక సేవ (సీఎస్ఆర్) ఉపాధ్యక్షురాలు ఉపాసన కామినేని కొణిదెల ముఖ్య అతిథిగా, విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ గడ్డం వంశీకృష్ణ, ప్రారంభ వేడుకలలో ఆత్మీయ అతిథిగా పాల్గొని, ప్రమాణ-2024ను లాంఛనంగా ఆరంభిస్తారని తెలిపారు. ఎన్ టీ టీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ ప్రాంతీయ అధినేత సంజీవ్ దేశ్ పాండే రెండో రోజు కార్యక్రమంలో పాల్గొని, ఈ ఫెస్ట్ సందర్భంగా నిర్వహించిన పోటీలలో ప్రతిభ చాటిన వారికి ప్రశంసా పత్రాలను అందజేస్తారన్నారు. తొలి రోజు నిర్వహించే త్రీవరీ బ్యాండ్ కు కొనసాగింపుగా రెండో రోజు రామ్ మిర్యాల, సాహితీ చాగంటి తను పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించనున్నట్టు తెలియజేశారు. బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్, సంప్రదాయ నృత్యాలు, ర్యాంప్ వాక్, కార్నివాల్, ఆటో ఎక్స్ పో, విద్యార్థులతో స్కిట్లు, పలు ప్రదర్శనలతో పాటు మనదేశంలోనే పేరొందిన డీజే ప్రాజెక్టు 91, మధ్య స్కాట్లాండ్ కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ డీజే నినా సూర్టే ఈ మూడు రోజుల ఫెస్ట్ లో ఆహూతుల జోష్ ను పెంచనున్నట్టు వారు వివరించారు.గీతం విద్యార్థులతో పాటు జంట నగరాల చుట్టుపక్కల నుంచి, ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఈ ఫెస్ట్ లో పాల్గొనడానికి ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారని, దాదాపు ఇరవైవేల మంది పాల్గొననున్నట్టు స్టూడెంట్ లైఫ్ ప్రతినిధులు తెలియజేశారు.

 

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago