Hyderabad

ఈటల ఎమ్మెల్యే పదవికి నేడే రాజీనామా….

ఈటల ఎమ్మెల్యే పదవికి నేడే రాజీనామా….
-14 న బీజేపీలోకి
-10 .30 గంటలకు అనుచరులతో గన్ పాక్ వద్ద అమరులకు నివాళి
-తరువాత అసెంబ్లీ సెక్రటరీ కి రాజీనామా సమర్పణ

హైదరాబాద్:

మాజీమంత్రి ఈటల రాజేందర్ నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. భూకబ్జా ఆరోపణలతో కేసీఆర్ మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ కు గురైన ఈటల కొన్ని రోజుల క్రితమే పార్టీకి రాజీనామా చేశారు. అంతకు ముందు ఈటల ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా తోపాటు ఇతర ముఖ్యనేతలను కలిశారు. బీజేపీ నుంచి సరైన హామిపొందిన తరువాతనే ఆ పార్టీలో చేరేందుకు మొగ్గుచూపారని తెలుస్తుంది.

ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఆరోజే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ చేయలేదు… అనంతరం ఆయన నియోజవర్గమైన హుజురాబాద్ లో పర్యటించారు. తాను పార్టీ పెట్టలేదు … పార్టీలో చేరలేదని మాటలు తో ఆయన స్వరంలో మార్పు వచ్చిందని పరిశీలకులు భావించారు.మొత్తానికి బీజేపీ లో చేరడం ఆయనకు అంతగా ఇష్టం లేనప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నందున తనకు రక్షణ ఉంటుందని భావించారని సమాచారం.

బీజేపీ లో చేరేందుకు ముహూర్తం ఖరారు కావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని రాజీనామా లేఖ అందజేసేందుకు అసెంబ్లీ కార్యాలయానికి వస్తున్నట్లు సమాచారం పంపగా కరోనా బాగా వ్యాపిస్తుండటంతో కార్యాలయానికి రాలేక పోతున్నానని తెలిపారు.రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేయమని చెప్పినట్లు తెలుస్తుంది.రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో అందించడంతో పాటు టీఆర్ యస్ కార్యాలయానికి కూడా మెస్సెంజర్ లేదా ఇమెయిల్ ద్వారా పంపాలని ఈటల నిర్ణయించుకుంట్లు సమాచారం.

Venu

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

6 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

6 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago