మనవార్తలు ,శేరిలింగంపల్లి :
మారుతున్న విద్యావిధానానికి అనుగుణంగా విద్యాబోధన జరగాలని ప్రముఖ విద్యావేత్త, ఎన్ సి ఈ ఆర్ టి రీసెర్చ్ పర్సన్ డాక్టర్ రామకృష్ణ ఆధురి అన్నారు. బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లో గల జ్యోతి విద్యాలయ ఉన్నత పాఠశాల లో బుధవారం నాడు ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రామకృష్ణ ఉపాద్యాయులందరికి నూతన విద్యా విధానం గురించి ఎన్నో మెళుకువలను వివరించారు.
అదే విధంగా ఉపాద్యాయులందరూ పరస్పర సహకారంతో విధులను నిర్వహించటం, విద్యార్థులు ఎదుర్కొంటున్న రకరకాల విద్యాపరమైన సమస్యలను అధిగమించడానికి వివిధ రకాల సూచనలను అందించారు. ఇటువంటి శిక్షణా తరగతులను నిర్వహించడం ద్వారా మారుతున్న నూతన విద్యా విధానాలకు అనుగుణంగా తమ ఉపాద్యాయుల బృందం కూడా సన్నద్ధంగా ఉండేలా జ్యోతి విద్యాలయ ఉన్నత పాఠశాల యాజమాన్యం సర్వదా కృషి చేస్తున్నారని తెలిపారు. గుడ్ లర్నింగ్ ఇన్ యాక్షన్ పేరుతో విద్యార్థులకు సులభంగా పాఠాలు అర్థమయ్యేలా బోధించడం ఎలా అనేది కూడా వివరించినట్లు అధ్యాపకుల బృందం తెలిపింది.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…