– గీతం వర్క్షాప్ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ స్పష్టీకరణ
మనవార్తలు ,పటాన్ చెరు:
ఒక నిర్దిష్ట వాతావరణంలో , తగిన సమయ వ్యవధిలో , వెఫల్యం లేకుండా , ఉద్దేశించిన పనితీరును నిర్వర్తించడమే విశ్వసనీయ సాంకేతికత అని అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ పుచ్చా అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ రిలయబిలిటీ ఇంజనీరింగ్ ‘ అనే అంశంపై గురువారం నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు . విశ్వసనీయ సాంకేతికత లక్ష్యం ఒక ప్రక్రియ స్వాభావిక విశ్వసనీయతను మూల్యాంకనం చేయడమని ఆయన చెప్పారు .
ఒక వంతెన , రిజర్వాయర్ లేదా భవన నిర్మాణంలో కాంక్రీటు నాణ్యత ముఖ్య భూమిక పోషిస్తుందని , అందువల్ల నాణ్యతపై నిరంతర నియంత్రణ అవసరమని ఆయన స్పష్టీకరించారు . కాంక్రీటు నాణ్యతను పరీక్షించే విధానాలను ఆయన ఉదాహరణలతో సహా వివరించారు . ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు జవాబివ్వడమే కాకుండా స్వీయ అనుభవాలను కూడా సదస్యులతో పంచుకున్నారు .
P తొలుత , స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావుతో కలిసి సివిల్ విభాగాధిపతి డాక్టర్ బీఎస్ఆర్కే ప్రసాద్ అతిథిని స్వాగతించి , సత్కరించి , సదస్యులకు పరిచయం చేశారు . ఇంజనీరింగ్ అధ్యాపకులు , విద్యార్థులు , పరిశోధకులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…