గీతంలో ఘనంగా ఇంజనీర్స్ డే ఉత్సవాలు
పటాన్చెరు:
సంక్లిష్టమైన పలు సమస్యలకు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎన్నో సులువైన పరిష్కారాలు చూపి మనందరికీ ఆదర్శంగా నిలిచారని పటాన్చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ అన్నారు. విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతియేటా నిర్వహించే ఇంజనీర్స్ డేని గీతంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్షగుండం చిత్రపటాని పుష్పాంజలి ఘటించిన ప్రోవీసీ మాట్లాడుతూ అతి చిన్న డ్యామ్ నిర్మాణం ద్వారా మైసూరు ను ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా మార్చారని, మూసీకి నడకలు నేర్పడం ద్వారా హైదరాబాద్ కు వరద ముప్పును తప్పించారని కొనియాడారు.
సముద్రపు కోతను నివారించడానికి ఒక పాత పడవను అక్కడ ముంచడం ద్వారా విశ్వేశ్వరయ్య సమస్యను సులువుగా పరిష్కరించిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మోక్షగుండం వద్ద ఎప్పుడూ రెండు కొవ్వొత్తులు, రెండు పెన్నులు ఉండేవని, ప్రభుత్వ పనికోసం సర్కారు కొవ్వొత్తిని వాడేవారని, ప్రభుత్వ పత్రాలపై సంతకానికి సర్కారు ఇచ్చిన పెన్నును వాడేవారని, అదే సొంత పనుల కోసం సొంత క్యాండిల్, పెన్నులను వాడేవారంటూ ఆయన నిబద్ధతను స్మరించుకున్నారు. విశ్వేశ్వరయ్య సేవలను గీతం ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ ఏకే మిట్టల్, బీ – స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ లు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలువురు డెరైక్టర్లు, ప్రిన్సిపాళ్ళు, అధ్యాపకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…