పటాన్చెరు:
పటాన్చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఎన్సీసీ యూనిట్ ను నిజామాబాద్ లోని 33 (తెలంగాణ) బెటాలియన్ ప్రధాన కార్యాలయ కమాండర్ కల్నల్ హెచ్ఎస్ఎస్ కృష్ణకుమార్ గురువారం తనిఖీ చేశారు. ఆయన వెంట 33 (తెలంగాణ) బెటాలియన్, సంగారెడ్డి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ కుమార్ శర్మ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నల్ ఎస్.కె.సింగ్ కూడా ఉన్నారు. కల్నల్ కృష్ణకుమార్ గీతం ఎన్సీసీ క్యాడెట్లతో ముఖాముఖి చర్చించడంతో పాటు, వారి పనితీరును ప్రశంసించారు.
మెరుగైన ప్రమాణాలను సాధించడానికి నిరంతరాయంగా శిక్షణ నిర్వహించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. అత్యుత్తమ శిక్షణ పొందినవారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలలో రాణించగలరని అభిలషించారు. నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ గా పిలిచే గీతం గ్రంథాలయాన్ని సందర్శించి, అక్కడి ప్రమాణాలను ఆయన బహుదా ప్రశంసించారు. తొలుత, కల్నల్ కృష్ణకుమార్ను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఎన్సీసీ అధికారి డాక్టర్ ఆర్.శ్రీనివాసరాజు స్వాగతించి, శాలువాతో సత్కరించారు
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…