పటాన్చెరు
పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరం బండ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న ట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం రామేశ్వరంబండలో వైకుంఠధామం నిర్మాణ పనులకు స్థానిక సర్పంచ్ ధరణి అంతి రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో వైకుంఠ దామాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు
నియోజవర్గంలో ఇప్పటికే దాదాపు అన్ని గ్రామాల్లో వైకుంఠ దామాలు పూర్తయినట్లు తెలిపారు. రోజు రోజుకీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్న రామేశ్వరం బండ లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామ పరిధిలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలను ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బన్సీలాల్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, అంతి రెడ్డి, గ్రామ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…
ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…