పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ బుధవారం డాక్టర్ దువ్వూరి సుబ్బారావు పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. పూర్వ భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్, కౌటిల్యాలోని విశిష్ట విజిటింగ్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ సుబ్బారావు ‘జస్ట్ ఎ మెర్సెనరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకాన్ని రచించారు. డాక్టర్ సుబ్బారావు ఐదేళ్ల (2008-13) పాటు భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ గా పనిచేశారు. అంతకు ముందు, ఆయన భారత ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా (2007-08), ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (2005-07) కార్యదర్శి వంటి గౌరవనీయమైన పదవులను నిర్వహించారు. ఈ పుస్తకం డాక్టర్ సుబ్బారావు అసాధారణ కెరీర్ కు సంబంధించిన ఆకర్షణీయమైన, శ్రద్ధాసక్తులతో కూడిన కథనాన్ని అందించడమే గాక, యువ నిపుణులకు వారి సొంత వృత్తిలో రాణించడానికి మార్గనిర్దేశనం చేసేలా, యువతను ప్రేరేపించేలా ఉంది. వివిధ శాఖలలో పలు హోదాలలో ఆయన చేసిన సుదీర్ఘ ప్రయాణం నుంచి పాఠాలు నేర్చుకోవడంతో పాటు ప్రారంభ జిల్లా-స్థాయి నియామకాల నుంచి భారతదేశ బ్యూరోక్రాటిక్ ఫ్రేమ్ వర్క్ వరకు జరిగిన పరిణామ క్రమం, పౌర సేవల్లో లింగ సమానత్వం వంటి పలు ఆసక్తికర అంశాలను సృజిస్తూ సాగింది.
చివరగా, తన తల్లికి రాసిన లేఖను ఈ పుస్తకంలో అచ్చు వేయడంతో పాటు, దానిని డాక్టర్ సుబ్బారావు స్వయంగా చదివి వినిపించడం అందరినీ కదిలింపజేసింది.రచయిత డాక్టర్ సుబ్బారావుతో సంభాషణనను కౌటిల్యాలోని విజిటింగ్ ఫ్యాకల్టీ, ఇండిపెండెంట్, ముల్టీమీడియా జర్నలిస్టు స్మితా శర్మ నేర్పుగా నిర్వహించగా, కౌటిల్యా ప్రోగ్రామ్ మేనేజర్ శివంగి శర్మ వందన సమర్పణ చేశారు.ఈ కార్యక్రమంలో కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ డీన్ సయ్యద్ అక్బరుద్దీన్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సుబ్బారావుని అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…