– జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని మూడు జీహెచ్ఎంసీ డివిజన్ లలో అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను సూచించారు. గురువారం పటాన్ చెరు క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభివృద్ధి పనుల పైన సమీక్ష సమావేశం నిర్వహించారు. పటాన్ చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్ లలో టెండర్లు పూర్తయిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే, అధికారులకు ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా, పనులు చేయించాలని తెలిపారు. డివిజన్ల పరిధిలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులను తొందరగా చేపట్టాలని అన్నారు. ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే సమస్యను పరిష్కరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీనగర్, రామచంద్రాపురం కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్, డిప్యూటీ కమిషనర్ సురేష్, సంబంధిత శాఖల ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…