పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
‘ అంతరించిపోతున్న భారతీయ కళల వేడుకలను ‘ సంస్కృతి ‘ పేరిట గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎస్చ్ఎస్ ) విద్యార్థులు సగర్వంగా నిర్వహించారు . తమ విద్యా సంస్థలోని విద్యార్థులు , అధ్యాపకులలో నిబిడీకృతంగా ఉన్న కళాకారులను కళ , కవిత్వం వంటి పోటీల నిర్వహణ ద్వారా వెలితీశారు . అంతేగాక , భారతీయ కళల స్థితిపై అభిప్రాయాలను తెలియజేయడానికి యువతకు వక్తృత్వం పోటీలను నిర్వహించారు . ‘ పొట్టి సినిమా ‘ ( షార్ట్ ఫిల్మ్ ) పేరిట నిర్వహించిన పోటీకి ఔత్సాహికులను ఆహ్వానించగా , దాదాపు 43 మంది భారీ భాగస్వామ్యంతో విశేష ఆదరణ లభించింది . కళల పట్ల యువతరానికి ఉన్న ఉత్సుకత , అభిరుచిలకు తార్కాణంగా నిలిచింది . హిట్వర్స్ సృష్టికర్త డాక్టర్ శెల్లేష్ కొలను , ప్రముఖ టాలీవుడ్ నటి శ్రీవిద్యా మహర్షి , పాత్రికేయురాలు ప్రేమమాలిని , గాయని లాలసలను సంస్కృతి వేదికపై సత్కరించారు . మొత్తంగా ఈ వేడుక శాస్త్రీయ ప్రదర్శనలు , అనుకరించలేని అద్భుతకమైన కళలకు వేదికగా నిలిచింది . మనదేశంలోని చేనేత కళాకారులకు మద్దతునిస్తూ విద్యార్థులు చేనేత దుస్తులు ధరించి ఈ వేడుకలలో పాల్గొనడం విశేషం .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…