పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని మంగళవారం జర్మనీ నుంచి వచ్చిన సమాజ సాధికారత గ్రామీణ సంస్థ ( రోజ్ ) ప్రతినిధులు రాబర్ట్ ఫెల్లెనెర్ , డెటైర్లతో పాటు భారతీయ ప్రతినిధులు- రోజ్ అధ్యక్షుడు వి.శేషయ్య , ఉపాధ్యక్షుడు వె.వి.రావులు సందర్శించారు . ఈ బృందం గీతం గ్రంథాలయం , శివాజీ ఆడిటోరియంలను సందర్శించారు . జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) సమన్వయకర్త డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్ ఈ పర్యటనను సమన్వయం చేశారు .
తొలుత , రోజ్ బృందం రుద్రారంలోని ఉన్నత పాఠశాలకు బహుకరించిన పది హెచ్పీ కంప్యూటర్లతో కూడిన టెక్నికల్ లాబ్ , 3 కేవీ సౌర విద్యుత్ వ్యవస్థను రాబర్ట్ ఫెల్లెనెర్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు . కంప్యూటర్ విద్యాబోధన కోసం ఓ స్థానిక వాలంటీరు , నెలకు పది వేల రూపాయల వేతనంతో ఏర్పాటు చేశారు . తాము ఇచ్చిన ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావాలని ఆ బృందం ఆకాక్షించింది . మేఘావృతం అయినప్పుడు కూడా విద్యుత్ను ఉత్పత్తి చేయగల సౌర ఫలకాలను తాము అమర్చామని , అదనపు విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానించామని , తద్వారా కొంత మొత్తం ఆదాయం కూడా పాఠశాలకు తిరిగొస్తుందని వారు చెప్పారు . వచ్చే ఏడాది కుట్టు మిషన్లు , కుట్టు పని నేర్పించే శిక్షకుడితో పాటు పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తామని విద్యార్థుల హర్షధ్వానాల మధ్య రోజ్ బృందం హామీ ఇచ్చింది . ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పం ఉపసర్పంచ్ యాదయ్య , పలువురు గ్రామ పెద్దలు , అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు . ఎన్సీసీ అధికారి శంకర్ ఆధ్వర్యంలో ఎన్సీసీ డ్రెస్లో ఉన్న విద్యార్థులతో ఏర్పాటుచేసిన స్వాగతం కార్యక్రమం , పలు శాస్త్ర ( సెన్స్డ్ ) విషయాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన రంగవల్లులు రోజ్ బృందాన్ని ఆకట్టుకున్నాయి .
ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్ డెంట్ కు వినతి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మనవార్తలు ప్రతినిధి ,…
ఎస్ టిపి ప్లాంటు ఏర్పాటును విరమించుకోవాలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, కలెక్టర్ కు వినతి మనవార్తలు ప్రతినిధి…
ఆనందంగా పాల్గొన్న గీతం ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆరోగ్యం, శ్రేయస్సుకు యోగాను ఒక సంపూర్ణ…
మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ఖాతాలో మరో అవార్డు దక్కింది .…