పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
‘ అంతరించిపోతున్న భారతీయ కళల వేడుకలను ‘ సంస్కృతి ‘ పేరిట గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎస్చ్ఎస్ ) విద్యార్థులు సగర్వంగా నిర్వహించారు . తమ విద్యా సంస్థలోని విద్యార్థులు , అధ్యాపకులలో నిబిడీకృతంగా ఉన్న కళాకారులను కళ , కవిత్వం వంటి పోటీల నిర్వహణ ద్వారా వెలితీశారు . అంతేగాక , భారతీయ కళల స్థితిపై అభిప్రాయాలను తెలియజేయడానికి యువతకు వక్తృత్వం పోటీలను నిర్వహించారు . ‘ పొట్టి సినిమా ‘ ( షార్ట్ ఫిల్మ్ ) పేరిట నిర్వహించిన పోటీకి ఔత్సాహికులను ఆహ్వానించగా , దాదాపు 43 మంది భారీ భాగస్వామ్యంతో విశేష ఆదరణ లభించింది . కళల పట్ల యువతరానికి ఉన్న ఉత్సుకత , అభిరుచిలకు తార్కాణంగా నిలిచింది . హిట్వర్స్ సృష్టికర్త డాక్టర్ శెల్లేష్ కొలను , ప్రముఖ టాలీవుడ్ నటి శ్రీవిద్యా మహర్షి , పాత్రికేయురాలు ప్రేమమాలిని , గాయని లాలసలను సంస్కృతి వేదికపై సత్కరించారు . మొత్తంగా ఈ వేడుక శాస్త్రీయ ప్రదర్శనలు , అనుకరించలేని అద్భుతకమైన కళలకు వేదికగా నిలిచింది . మనదేశంలోని చేనేత కళాకారులకు మద్దతునిస్తూ విద్యార్థులు చేనేత దుస్తులు ధరించి ఈ వేడుకలలో పాల్గొనడం విశేషం .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…