శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతుల సహాయార్థం ప్రధాన మంత్రి సహాయ నిధికి త్రివేణి ఎడ్యుకేషనల్ విద్యార్థులు జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్షా నూట పదహారు రూపాయల విరాళాన్ని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కి అందజేశారు. త్రివేణి డైరెక్టర్ డా వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ 23 న దేశవ్యాప్తంగా భారతదేశ 5వ ప్రధానమంత్రి, భారతదేశపు రైతుల విజేతగా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. తమ విద్యాసంస్థలో విద్యనభ్యసించే చిన్నారులు రైతులకోసం విరాళాలు సేకరించి గవర్నర్ కు అందజేయడం జరిగిందన్నారు. రైతు చేతులు భూమి లోకి వెళ్తేనే, మన వేళ్ళు నోటిలోకి వెళతాయని, రైతును కాపాడుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులను, ప్రోత్సహించిన త్రివేణి స్కూల్స్ డైరెక్టర్ డా. వీరేంద్ర చౌదరి ని, మార్గం చూపిన ఉపాధ్యాయ బృందాన్ని, విరాళాలను అందచేసిన విద్యార్థులను గవర్నర్ తమిళ సై సత్కరించారు. విద్యార్థులకు పుస్తకాలు బహుకరించి, అభినందించారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…