బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో గురువారం బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మహిళలు భక్తిశ్రద్ధలతో కలశ యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి దంపతులు ముఖ్యఅతిథిగా హాజరై కలశ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక దుర్గామాత ఆలయంలో చంద్రారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతి ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలను మున్సిపాలిటీలో అంగరంగ వైభవంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ప్రతి ఒక్కరి ఆచార సంప్రదాయాలను గౌరవించాలన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చంద్రారెడ్డి దంపతులను స్థానిక మహిళలు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి గారు, ఐ.ఎన్.టి.యు.సి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మా రెడ్డి గారు, మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు ఆనంద్ కృష్ణ రెడ్డి , స్థానిక నాయకులు రమణయ్య , రాజ్ గోపాల్ , దిననాధ్ , జె.జె సింగ్ గారు, రాజారామ్, శ్రీమన్నారాయణ , చంద్రశేఖర్ , శ్రవణ్ , మా అంబి మహిళా సేవాసమితి సభ్యులు దుర్గవతి , పరంశీల , ప్రమీల దేవి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…