స్కెచింగ్ కార్యశాలలో ఆర్కిటెక్చర్ విద్యార్థులకు శిక్షకుల సూచన
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆర్కిటెక్చర్ విద్యార్థులలో నిబిడీక`తంగా ఉన్న కళాత్మకతకు సాంకేతికతను జోడిస్తే అటు ఖచ్చితత్వాన్ని పెంపొందించుకోవడమే కాకుండా, ఇటు వారి సృజనాత్మక ఆలోచనలను మరింత పెంపొందించుకోవచ్చని శిక్షకురాలు సానియా షర్పున్నీసా అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో రెండు రోజుల స్కెచింగ్ కార్యశాలను నిర్వహించారు. ఆర్కిటెక్చరల్ డిజైన్ రంగంలో కీలకమైన దృక్పథం, షేడింగ్, నిష్పత్తులతో సహా అవసరమైన స్కెచింగ్ టెక్నిక్ లపై లోతైన అవగాహన ఈ వర్క్ షాప్ లో కల్పించారు.సాధారణమైన వాటిని సంక్లిష్టమైన, ఆకర్షణీయమైన స్కెచ్ లుగా మార్చడం, ప్రాదేశిక సంబంధాలను దృశ్యమానం చేయగల వారి సామర్థాన్ని, క్రియాత్మక, సౌందర్యపరంగా ఆహ్లాదకరమైన భవనాలను రూపొందించడంలో నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇందులో పాల్గొన్నవారు సాధన చేశారు. హాచింగ్, షేడింగ్ వంటి సాంకేతికతలను కూడా ఈ సందర్భంగా వారికి వివరించారు. ఈ కార్యశాలలో నిర్వహించిన ముఖాముఖిలో విద్యార్థుల మధ్య చిట్కాలు, సాంకేతికతల మార్పిడిని ప్రోత్సహించారు. కార్యశాల ముగిసే సమయానికి విద్యార్థులు తమ డ్రాయింగ్ లో ఖచ్చితత్వాన్ని పెంపొందించుకోవడమే కాకుండా, వారి సృజనాత్మక ఆలోచనలను మెరుగుపరచుకున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…