స్కెచింగ్ కార్యశాలలో ఆర్కిటెక్చర్ విద్యార్థులకు శిక్షకుల సూచన
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆర్కిటెక్చర్ విద్యార్థులలో నిబిడీక`తంగా ఉన్న కళాత్మకతకు సాంకేతికతను జోడిస్తే అటు ఖచ్చితత్వాన్ని పెంపొందించుకోవడమే కాకుండా, ఇటు వారి సృజనాత్మక ఆలోచనలను మరింత పెంపొందించుకోవచ్చని శిక్షకురాలు సానియా షర్పున్నీసా అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో రెండు రోజుల స్కెచింగ్ కార్యశాలను నిర్వహించారు. ఆర్కిటెక్చరల్ డిజైన్ రంగంలో కీలకమైన దృక్పథం, షేడింగ్, నిష్పత్తులతో సహా అవసరమైన స్కెచింగ్ టెక్నిక్ లపై లోతైన అవగాహన ఈ వర్క్ షాప్ లో కల్పించారు.సాధారణమైన వాటిని సంక్లిష్టమైన, ఆకర్షణీయమైన స్కెచ్ లుగా మార్చడం, ప్రాదేశిక సంబంధాలను దృశ్యమానం చేయగల వారి సామర్థాన్ని, క్రియాత్మక, సౌందర్యపరంగా ఆహ్లాదకరమైన భవనాలను రూపొందించడంలో నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇందులో పాల్గొన్నవారు సాధన చేశారు. హాచింగ్, షేడింగ్ వంటి సాంకేతికతలను కూడా ఈ సందర్భంగా వారికి వివరించారు. ఈ కార్యశాలలో నిర్వహించిన ముఖాముఖిలో విద్యార్థుల మధ్య చిట్కాలు, సాంకేతికతల మార్పిడిని ప్రోత్సహించారు. కార్యశాల ముగిసే సమయానికి విద్యార్థులు తమ డ్రాయింగ్ లో ఖచ్చితత్వాన్ని పెంపొందించుకోవడమే కాకుండా, వారి సృజనాత్మక ఆలోచనలను మెరుగుపరచుకున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…