మనవార్తలు , శేరిలింగంపల్లి :
కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీలో నూతనoగా ఏర్పాటు చేసిన 50 సిసి కెమెరాల ఓపెనింగ్ కార్యక్రమం రాజరాజేశ్వరి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్ డిసిసి వెంకటేశ్వర్లు ఏసీపీ రఘునందన్ రావు, ఎస్సై వెంకట్ రెడ్డి లతో కల్సి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిసి మాట్లాడుతూ సి సి కెమెరాల ఏర్పాటు కు ముందుకు వచ్చిన ధాతలకు అభినందలు తెలిపారు. వీరి ని ఆదర్శంగా తీసుకుని మిగతా కాలనీ వారు ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కృష్ణ,వైస్ ప్రెసిడెంట్ మధు ముదిరాజ్, యూత్ ప్రెసిడెంట్ విజయ్ సింగ్ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ హరికృష్ణ రాయుడు, కాలనీ అసోసియేషన్ మెంబర్స్ మద్దిలేటి యాదవ్, సంతోష్ శంకర్, కాంలని వాసులు ఎం ఎస్ ప్రసాద్, ప్రభాకర్ రెడ్డి, బసవ శంకర్, మోహన్ రావు, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. మొత్తం 110 కెమెరాలు విలువ 22 లక్షలు ప్రస్తుతం 50 కెమెరాలు 10 లక్షలు ఖర్చు అయినది మిగిలిన 60 కెమెరాల కు 12 లక్షలు త్వరలో మిగిలిన 60 కెమెరాల ఏర్పాటు చేస్తామని కాలనీ వాసులు తెలిపారు.
సి సి కెమెరాల ఏర్పాటు కు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన వెంకట రాజు, భగవాన్ దాస్, రామ్మూర్తి, రామ సుబ్బారెడ్డి మరియు వారి మిత్రులు అందరు కలిసి 10 లక్షల రూపాయలు సహాయం చేసిన వారికి కాలనీ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…