Telangana

సరైన సమయంలో సరైన మోతాదు ! – గీతం అతిథ్య ఉపన్యాసంలో ఔషధ వినియోగంపై అమెరికా నిపుణుడి సూచన

పటాన్‌చెరు:

ఔషధాలను (మందులు) సూచించిన పద్ధతిలో, అంటే సరైన మోతాదు, సరైన సమయంలో, సరైన పద్ధతిలో తీసుకోవాలని అమెరికాలోని హాటా స్పాట్ థెరప్యూటిక్స్ సీనియర్ ఉపాధ్యక్షుడు, కంప్యూటేషనల్ సెర్చ్ అధిపతి డాక్టర్ ఆల్డ్రిన్ డెన్నీ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సెర్చ్ ఆధ్వర్యంలో ‘ఔషధాల ఆవిష్కరణలో సవాళ్ళు అనే అంశంపై గురువారం ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔషదాలను సరిగా వినియోగించకపోతే ఆరోగ్యం మరింత క్షీణించి, ఆస్పత్రిలో కూడా చేరాల్సి రావచ్చని, కొన్నిసార్లు మరణం కూడా సంభవించే అవకాశాలు లేకపోలేదన్నారు.

దీర్ఘకాలిక పరిస్థితులను నియంత్రించడానికి, తాత్కాలిక పరిస్థితులకు చికిత్స చేయడానికి, దీర్ఘకాలిక ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఔషధ వినియోగం ఉండాలని ఆయన సూచించారు. సరిగా మందులు మింగితే కొన్నాళ్ళ తరువాత వాటిని తక్కువ మోతాదులోనో, లేదా పూర్తిగా నిలిపివేయడమో జరుగుతుందన్నారు. మందుల వినియోగంపై కొన్ని చిట్కాలను ఆయన వివరిస్తూ, ప్రతిరోజూ ఒకే సమయంలో తీసుకోవాలని, అందుకు సంబంధించిన సూచనలను ఔషధాలతో పాటు ఉంచుకోవాలని, సరైన మోతాదులోనే వినియోగించాలన్నారు.

అలాగే ఔషధ ఆవిష్కరణలో ఉన్న దశలను కూడా ఆయన విశదీకరించారు. తొలుత, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీవి రామారావు అతిథిని స్వాగతించి సదస్యులకు పరిచయడం చేయడంతో పాటు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐజెన్ బయో ఉపాధ్యక్షుడు డాక్టర్ రెజ్ జాన్, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సురేంద్రబాబు, కార్యక్రమ సమన్వయకర్తలు ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల, డాక్టర్ నరేష్ కుమార్ కటారి, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago