Hyderabad

మిస్టర్  సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 హైద‌రాబాద్‌కు చెందిన ప్రీత‌మ్ క‌ళ్యాణ్‌

హైదరాబాద్

హైదరాబాద్ 1 డిసెంబర్ 2021: ఇటీవల గోవాలో జరిగిన మిస్టర్ ఇండియా సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 ని హైదరాబాద్ కు చెందిన మోడల్ ప్రీతమ్ కళ్యాణ్ గెలుచుకున్నారు.జెస్సీ విక్టర్ , ర‌జ్నామొహ‌మ్మద్‌ల ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న దుబాయ్ మరియు భారతదేశం ఆధారిత కంపెనీ అయిన RageNyou  ఆధ్వర్యంలో  కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మంగళవారం ఇక్కడ విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు. ఈ కంపెనీ ఆధ్వ‌ర్యంలో గోవాలో నిర్వ‌హించిన అతిపెద్ద & ప్రతిష్టాత్మక ఈవెంట్‌లలో మిస్ట‌ర్ సూప‌ర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021ని ఒక‌టి.

ప్రీతం కళ్యాణ్ మిస్టర్ సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 టైటిల్‌ను గెలుచుకున్నారు, మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్‌వాల్‌చే ఈ అవార్డును అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ అవార్డును ద‌క్కించుకోవ‌డం ఎంతో గర్వంగా ఉంద‌న్నారు. ఈ పోటీలో 20కి పైగా నగరాల నుండి 120 మందికి పైగా పోటీదారులు పోటీలో పాల్గొన్నారు.

మిస్టర్ ఇండియా సూపర్ మోడల్  ఆఫ్ ఇండియా- 2021 ప్రీతమ్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “ఆత్మ‌విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మరియు మార్పును తీసుకురావడానికి అందాల వేదిక ఒక గొప్ప వేదిక అన్నారు. అందంగా ఉండటంతోపాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటమే కాకుండా కొత్త ప్రతిభను ఎల్లప్పుడూ ప్రోత్సహించేందుకు ఇలాంటి వేదిక‌లు ఉప‌యోగ‌ప‌డుతాయ‌న్నారు. మిస్ట‌ర్ ఇండియా సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 అనేది కేవలం అందాల పోటీ మాత్రమే కాద‌ని, పరివర్తన మరియు స్వీయ-అభివృద్ధి యొక్క ప్రయాణ‌మ‌ని అన్నారు. ఈ వేదిక ఎంతో మంది ఔత్సాహికుల‌కు స‌రైన వేదిక‌గానిల‌వ‌డ‌మే కాకుండా దేశంలో ఒక ప్ర‌త్యేక గుర్తింపును అందిస్తుంద‌న్నారు. ఈ అవార్డు సాధించ‌డం త‌న‌కు ఎంతో ఉత్సాహాన్ని నింపింద‌న్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

11 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago