_గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,అమీన్పూర్
అమీన్పూర్ మండల పరిధిలోని ఎనిమిది గ్రామ పంచాయతీలలో ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్టు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని దాయర, గండి గూడెం, వడక్ పల్లీ గ్రామాల్లో కోటి 50 లక్షల రూపాయల TSIIC నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో పాటు జిల్లా పరిషత్, ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలతో అన్ని గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. సుల్తాన్పూర్ లో ఏర్పాటైన మెడికల్ డివైస్ పార్క్ లో నూతన పరిశ్రమల ఏర్పాటు శరవేగంగా సాగుతోందని, స్థానికులకే ఉద్యోగ అవకాశాలు లభించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపిడిఓ మల్లేశ్వర్, సర్పంచులు భాస్కర్ గౌడ్, పాండు, లలితా మల్లేష్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, సీనియర్ నాయకులు రాజు, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…
శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…