_గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,అమీన్పూర్
అమీన్పూర్ మండల పరిధిలోని ఎనిమిది గ్రామ పంచాయతీలలో ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్టు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని దాయర, గండి గూడెం, వడక్ పల్లీ గ్రామాల్లో కోటి 50 లక్షల రూపాయల TSIIC నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో పాటు జిల్లా పరిషత్, ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలతో అన్ని గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. సుల్తాన్పూర్ లో ఏర్పాటైన మెడికల్ డివైస్ పార్క్ లో నూతన పరిశ్రమల ఏర్పాటు శరవేగంగా సాగుతోందని, స్థానికులకే ఉద్యోగ అవకాశాలు లభించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపిడిఓ మల్లేశ్వర్, సర్పంచులు భాస్కర్ గౌడ్, పాండు, లలితా మల్లేష్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, సీనియర్ నాయకులు రాజు, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…