మనవార్తలు ,పటాన్ చెరు:
జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జీఎంఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో పటాన్చెరు పట్టణంలో నిర్వహిస్తున్న ఉచిత పోలీసు శిక్షణ తరగతులను ఆదివారం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పరిశీలించారు. తరగతులకు హాజరవుతున్న నిరుద్యోగ యువతీ యువకులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 90 రోజుల పాటు కష్టపడి చదివితే జీవితాంతం సమాజంలో తలెత్తుకుని బ్రతకవచ్చు అని అన్నారు. అనుభవజ్ఞులైన శిక్షకు లతోపాటు, ఉన్నత అధికారుల చే ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిరుద్యోగ యువత నుంచి మంచి స్పందన లభిస్తోందని, అత్యధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తారన్న నమ్మకం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, శిక్షణ తరగతుల ఇంఛార్జి గోపి శంకర్, ఎస్సై నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…
శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…