politics

కేంద్రంపై మంత్రి కేటీఆర్ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు -గ‌డీల శ్రీకాంత్ గౌడ్

_మంత్రి కేటీఆర్ వ్యాఖ్య‌లను తీవ్రంగా ఖండించిన గడీల శ్రీకాంత్ గౌడ్

_శంకుస్థాపనలు, ప్రచారలకే పరిమితమైన మంత్రి కేటీఆర్

మనవార్తలు ,పటాన్ చెరు:

తెలంగాణ ప్ర‌భుత్వం మాట‌ల‌కే ప‌రిమిత‌మైందని..ఇచ్చిన వాగ్దానాలు నిల‌బెట్టుకోవ‌డం లేద‌ని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత అధికారం లోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని తెలిపారు. దీనికి పటాన్చెరు నియోజకవర్గమే ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌న‌మ‌న్నారు. సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ లు ఇచ్చి కేవలం శంకుస్థాపనలుకే పరిమితమ‌య్యార‌ని విమ‌ర్శించారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరు గాంచిన పాషమైలరం పారిశ్రామికవాడలో 4 సంవత్సరాల క్రితం వ్యర్థ జలాల శుద్ధి కేంద్రన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తే ఇప్పటి వరకు పనులు మొద‌లుకాలేద‌న్నారు .ఇక్క‌డ నిర్మించిన శిలాఫలకం సైతం మాయ‌మైంద‌న్నారు.

ఇక ఇక్క‌డి పరిశ్రమల ఏర్పాటు ద్వారా 5వేల మందికి ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌న్న మాట ఉత్తిదే అని ఎద్దేవా చేశారు. వారం రోజుల్లో పాషమైలరంకు ఐటిఐ తీసుకు వ‌స్తాన‌ని చెప్పి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి పురోగ‌తి లేద‌ని.. యువతకు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని చేసిన వాగ్దానాలు కేవలం మాటలకే పరిమితమైయ్యాయ‌ని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ విమ‌ర్శించారు.కేంద్రంపై మంత్రి కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నార‌ని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .

పటాన్ చెరులో ఉన్న పారిశ్రమల నుంచి, రియల్ ఎస్టేట్ నుంచి ఎంత ట్యాక్స్ వసూలు చేస్తున్నారో శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు . అందులో పటాన్ చెరు అభివృద్ధి ఎంత ఉపయోగిస్తున్నారో ప్రజలకు తెలియజేయాలన్నారు .పటాన్ చెరువు  శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి  కేవలం తన వ్యాపాలు, కమిషన్లపైనె ద్రుష్టి పెట్టారని, నియోజకవర్గ సమస్యలపై, అభివృద్ధిపై ఏనాడూ మాట్లాడకుండా ఉత్సవ విగ్రహాంగా మారార‌ని ఎద్దేవా చేశారు . ఇప్పటికైనా కేంద్రంపై తప్పుడు ఆరోపణలు మానుకొని  నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ సూచించారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

8 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago