Hyderabad

కేఎన్ క్లేవ్ లో జరుగుతున్న అక్రమాలకపై లోకాయుక్తలో పిర్యాదు

మనవార్తలు శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియపూర్ లో గలబికె ఎన్‌క్లేవ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శేరిలింగంపల్లి రెవిన్యూ డిపార్ట్మెంట్ మరియు గ్రేటర్ హైదరాబాద్ చందానగర్ సర్కిల్ 21 మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులతో చేతులు కలిపి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిలో బహుళ అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్స్ మరియు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నిర్మించడం పై ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవిన్యూ మరియు మున్సిపల్ అధికారులే కబ్జాదారులను ప్రోత్సహించి అక్రమాలకు పాల్పడుతున్న విషయం పై తగు చర్యలు తీసుకోవాలని స్థానికుడు టౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి లోకాయుక్త ను కోరాడు.

శేరిలింగంపల్లి మండల పరిధిలోని మ‌క్త మ‌హ‌బూబ్‌పేట్‌ సర్వే నెంబర్ 44 బీకేఎన్ క్లేవ్ లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆర్ టి ఐ యాక్ట్ కింద చందానగర్ సర్కిల్ 21 ఉపకమిషనర్, శేరిలింగంపల్లి ఎమ్మార్వో కు ఆర్టిఐ యాక్ట్ కింద దరఖాస్తు చేయగా అసలు నిజాలు బయట పడ్డాయని ఆయన తెలిపాడు. బికె ఎన్ క్లేవ్ కు సంబంధించిన 44 సర్వే నంబరు మొత్తం ప్రభుత్వ భూమి అని, ఈ స్థలంలో భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతుల్లేవని చెప్పారు.

జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం వారే ఎలాంటి అనుమతుల్లేవని చెప్పి లక్షల రూపాయలు లంచాలకు ఆశపడి బీకే ఎంక్లేవ్ అసోసియేషన్ రిజిస్టర్ నంబర్1268/2003 ప్రెసిడెంటుతో చేతులు కలిపి రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి మండల్ తాసిల్దార్ మరియు నాయబ్ తాసిల్దార్ మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ చందానగర్ సర్కిల్ 21 డిప్యూటీ కమిషనర్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వారు బహుళ అంతస్తుల బిల్డింగ్స్ నిర్మిస్తుంటే అక్రమార్కులు ఇచ్చేటువంటి డబ్బులకు ఆశపడి వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో కమర్షియల్ మరియు రెంట్ పర్పస్ అపార్ట్మెంట్ కడుతుంటే అడ్డుకోకపోగా వారికి అండగా ఉండి కోర్టుల నుండి స్టేటస్ కో తెచ్చుకోవాలని వీరే సలహాలిస్తూ అక్రమార్కులకు అండగా నిలబడుతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ స్థలాల్లో పేద వారు గుడిసె వేసుకుంటే ఆఘమేఘాల మీద వెళ్లి నానా హంగామా చేసే రెవెన్యూ, జీహెచ్ఎంసీ సిబ్బంది బహుళ అంతస్తుల పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, అధికారులను అడిగితే అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ఒత్తిడి మేరకు చూసీచూడనట్టు వారు ఇచ్చింది తీసుకొని వదిలి వేస్తున్నామని చెప్పడం జరుగుతుందని, అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ప్రజాధనానికి గండి పడుతోందని విమర్శించారు. కావున అక్రమార్కుల దగ్గర నుండి లక్షల రూపాయలు లంచాలు తీసుకుని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖలోని అవినీతి అధికారులపై చర్య తీసుకోని, బికె ఎన్ క్లేవ్ లో జరిగే అక్రమ కట్టడాలపై విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని కాపాడడంతో పాటు ప్రజలకు చెందవలసిన వేల కోట్ల రూపాయల భూములను కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపాడు.

 

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago