Hyderabad

కేఎన్ క్లేవ్ లో జరుగుతున్న అక్రమాలకపై లోకాయుక్తలో పిర్యాదు

మనవార్తలు శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియపూర్ లో గలబికె ఎన్‌క్లేవ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శేరిలింగంపల్లి రెవిన్యూ డిపార్ట్మెంట్ మరియు గ్రేటర్ హైదరాబాద్ చందానగర్ సర్కిల్ 21 మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులతో చేతులు కలిపి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిలో బహుళ అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్స్ మరియు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నిర్మించడం పై ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవిన్యూ మరియు మున్సిపల్ అధికారులే కబ్జాదారులను ప్రోత్సహించి అక్రమాలకు పాల్పడుతున్న విషయం పై తగు చర్యలు తీసుకోవాలని స్థానికుడు టౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి లోకాయుక్త ను కోరాడు.

శేరిలింగంపల్లి మండల పరిధిలోని మ‌క్త మ‌హ‌బూబ్‌పేట్‌ సర్వే నెంబర్ 44 బీకేఎన్ క్లేవ్ లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆర్ టి ఐ యాక్ట్ కింద చందానగర్ సర్కిల్ 21 ఉపకమిషనర్, శేరిలింగంపల్లి ఎమ్మార్వో కు ఆర్టిఐ యాక్ట్ కింద దరఖాస్తు చేయగా అసలు నిజాలు బయట పడ్డాయని ఆయన తెలిపాడు. బికె ఎన్ క్లేవ్ కు సంబంధించిన 44 సర్వే నంబరు మొత్తం ప్రభుత్వ భూమి అని, ఈ స్థలంలో భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతుల్లేవని చెప్పారు.

జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం వారే ఎలాంటి అనుమతుల్లేవని చెప్పి లక్షల రూపాయలు లంచాలకు ఆశపడి బీకే ఎంక్లేవ్ అసోసియేషన్ రిజిస్టర్ నంబర్1268/2003 ప్రెసిడెంటుతో చేతులు కలిపి రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి మండల్ తాసిల్దార్ మరియు నాయబ్ తాసిల్దార్ మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ చందానగర్ సర్కిల్ 21 డిప్యూటీ కమిషనర్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వారు బహుళ అంతస్తుల బిల్డింగ్స్ నిర్మిస్తుంటే అక్రమార్కులు ఇచ్చేటువంటి డబ్బులకు ఆశపడి వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో కమర్షియల్ మరియు రెంట్ పర్పస్ అపార్ట్మెంట్ కడుతుంటే అడ్డుకోకపోగా వారికి అండగా ఉండి కోర్టుల నుండి స్టేటస్ కో తెచ్చుకోవాలని వీరే సలహాలిస్తూ అక్రమార్కులకు అండగా నిలబడుతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ స్థలాల్లో పేద వారు గుడిసె వేసుకుంటే ఆఘమేఘాల మీద వెళ్లి నానా హంగామా చేసే రెవెన్యూ, జీహెచ్ఎంసీ సిబ్బంది బహుళ అంతస్తుల పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, అధికారులను అడిగితే అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ఒత్తిడి మేరకు చూసీచూడనట్టు వారు ఇచ్చింది తీసుకొని వదిలి వేస్తున్నామని చెప్పడం జరుగుతుందని, అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ప్రజాధనానికి గండి పడుతోందని విమర్శించారు. కావున అక్రమార్కుల దగ్గర నుండి లక్షల రూపాయలు లంచాలు తీసుకుని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖలోని అవినీతి అధికారులపై చర్య తీసుకోని, బికె ఎన్ క్లేవ్ లో జరిగే అక్రమ కట్టడాలపై విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని కాపాడడంతో పాటు ప్రజలకు చెందవలసిన వేల కోట్ల రూపాయల భూములను కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపాడు.

 

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago