Districts

తెలంగాణ రాష్ట్రంలో బహుజ‌న స‌మాజ్ పార్టీని బ‌లోపేతంచెయ్యాలి

మనవార్తలు ,ప‌టాన్ చెరు

బ‌హుజ‌నుల రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా బీఎస్సీ కార్య‌చర‌ణ ప్ర‌ణాళిక ఉంటుంద‌ని బీఎస్సీ ప‌టాన్ చెరు ఉపాధ్య‌క్షులు ప్ర‌వీణ్, స‌తీష్ లు అన్నారు . సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వర్గంలోని రామ‌చంద్రాపురంలో బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమంలో బీఎస్పీ ప‌టాన్ చెరు ఉపాధ్య‌క్షులు ప్ర‌వీణ్ ఆధ్వర్యంలోతెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బ‌హుజ‌న స‌మాజ్ పార్టీలో చేరారు. జిల్లా అధ్య‌క్షులు జి.స‌తీష్ కండువా క‌ప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

అనంత‌రం నిర్వ‌హించిన స‌మావేశంలో ప్ర‌వీణ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బ‌డుగు బ‌ల‌హీన వర్గాల‌ను ప‌క్క‌కుపెట్టి  దొర‌ల తెలంగాణ‌గా మార్చాడని విమ‌ర్శించారు. తెలంగాణ ప్ర‌భుత్వంలో బ‌డుగు , బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చోటులేద‌న్నారు .తెలంగాణ రాష్ట్రంలో బహుజ‌న స‌మాజ్ పార్టీని బ‌లోపేతం చేసేందుకు యువ‌త క‌లిసిరావాల‌ని కోరారు. దొర‌ల పాల‌న‌లో బీసీ,ఎస్సీ,ఎస్టీ , మైనార్టీ కులాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స‌భ‌లు , స‌మావేశాలు ఏర్పాటు చేసి పార్టీ బ‌లోపేతం కోసం ప్ర‌తి ఒక్క‌రు కృషి చేయాల‌న్నారు. మార్పు కోసం ప్ర‌తి ఒక్క‌రు క‌లిసి రావాల‌ని ప్ర‌వీణ్ పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నిక‌ల్లో బీఎస్సీ పార్టీ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తుంద‌ని రెండేళ్ళ‌లో ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో పార్టీ ప్రతిష్ట‌ప‌ర్చాల్సి న అస‌వ‌రం ఉంద‌న్నారు .ప్ర‌తి ఒక్క‌రూ బూత్ స్థాయికి వెళ్ళి బీఎస్సీ పార్టీ చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు. ముఖ్యంగా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌లంతా క‌లిసి ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు .

ఈ స‌మావేశంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి సతీష్, జిల్లా కార్యదర్శి , పటాన్‌చెరు అసెంబ్లీ ఇంచార్జి కె సంజీవ, పటాన్చెరు అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ప్రవీణ్, జిల్లా EC సభ్యులు నర్శింహా, జిహెచ్ఎంసి 111 భారతీనగర్ డివిజన్ అధ్యక్షుడు పి శ్రీశైలం, 113 పటాన్చెరు డివిజన్ అధ్యక్షుడు మహేందర్, పటాన్చెరు మండల కన్వీనర్ వెంకటేష్,అమీన్‌పూర్ మండల కన్వీనర్ చంద్రశేఖర్,తెల్లాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు దర్శన్ మరియు ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ నాయక్, సచిన్, పృథ్వీ, సోలోమన్ తో పాటు బీఎస్పీ ముఖ్య నేత‌లు ,
సిద్ది రాములు, జనార్ధన్. తదితరులు పాల్గొన్నరు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago