Districts

తెలంగాణ రాష్ట్రంలో బహుజ‌న స‌మాజ్ పార్టీని బ‌లోపేతంచెయ్యాలి

మనవార్తలు ,ప‌టాన్ చెరు

బ‌హుజ‌నుల రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా బీఎస్సీ కార్య‌చర‌ణ ప్ర‌ణాళిక ఉంటుంద‌ని బీఎస్సీ ప‌టాన్ చెరు ఉపాధ్య‌క్షులు ప్ర‌వీణ్, స‌తీష్ లు అన్నారు . సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వర్గంలోని రామ‌చంద్రాపురంలో బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమంలో బీఎస్పీ ప‌టాన్ చెరు ఉపాధ్య‌క్షులు ప్ర‌వీణ్ ఆధ్వర్యంలోతెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బ‌హుజ‌న స‌మాజ్ పార్టీలో చేరారు. జిల్లా అధ్య‌క్షులు జి.స‌తీష్ కండువా క‌ప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

అనంత‌రం నిర్వ‌హించిన స‌మావేశంలో ప్ర‌వీణ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బ‌డుగు బ‌ల‌హీన వర్గాల‌ను ప‌క్క‌కుపెట్టి  దొర‌ల తెలంగాణ‌గా మార్చాడని విమ‌ర్శించారు. తెలంగాణ ప్ర‌భుత్వంలో బ‌డుగు , బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చోటులేద‌న్నారు .తెలంగాణ రాష్ట్రంలో బహుజ‌న స‌మాజ్ పార్టీని బ‌లోపేతం చేసేందుకు యువ‌త క‌లిసిరావాల‌ని కోరారు. దొర‌ల పాల‌న‌లో బీసీ,ఎస్సీ,ఎస్టీ , మైనార్టీ కులాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స‌భ‌లు , స‌మావేశాలు ఏర్పాటు చేసి పార్టీ బ‌లోపేతం కోసం ప్ర‌తి ఒక్క‌రు కృషి చేయాల‌న్నారు. మార్పు కోసం ప్ర‌తి ఒక్క‌రు క‌లిసి రావాల‌ని ప్ర‌వీణ్ పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నిక‌ల్లో బీఎస్సీ పార్టీ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తుంద‌ని రెండేళ్ళ‌లో ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో పార్టీ ప్రతిష్ట‌ప‌ర్చాల్సి న అస‌వ‌రం ఉంద‌న్నారు .ప్ర‌తి ఒక్క‌రూ బూత్ స్థాయికి వెళ్ళి బీఎస్సీ పార్టీ చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు. ముఖ్యంగా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌లంతా క‌లిసి ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు .

ఈ స‌మావేశంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి సతీష్, జిల్లా కార్యదర్శి , పటాన్‌చెరు అసెంబ్లీ ఇంచార్జి కె సంజీవ, పటాన్చెరు అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ప్రవీణ్, జిల్లా EC సభ్యులు నర్శింహా, జిహెచ్ఎంసి 111 భారతీనగర్ డివిజన్ అధ్యక్షుడు పి శ్రీశైలం, 113 పటాన్చెరు డివిజన్ అధ్యక్షుడు మహేందర్, పటాన్చెరు మండల కన్వీనర్ వెంకటేష్,అమీన్‌పూర్ మండల కన్వీనర్ చంద్రశేఖర్,తెల్లాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు దర్శన్ మరియు ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ నాయక్, సచిన్, పృథ్వీ, సోలోమన్ తో పాటు బీఎస్పీ ముఖ్య నేత‌లు ,
సిద్ది రాములు, జనార్ధన్. తదితరులు పాల్గొన్నరు.

Ramesh

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

12 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago