_లక్ష 25 వేల రూపాయల ఎల్ఓసి అందజేత
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణానికి చెందిన ఠాకూర్ నరేందర్ సింగ్ ప్రమాదంలో ఎడమ కాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో కృత్రిమ కాలు కోసం స్థానిక ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కృత్రిమ కాలు కోసం మంజూరైన ఒక లక్ష 25 వేల రూపాయల విలువైన ఎల్ఓసి అనుమతి పత్రాన్ని ఆదివారం ఎంఎల్ఏ జిఎంఆర్ నరేందర్ సింగ్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలన అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
అమీన్పూర్ ఎస్టిపిని తరలిస్తాం లేదా రద్దు అవసరమైతే ముఖ్యమంత్రితో సైతం చర్చిస్తాము ఎస్టిపి ప్లాంట్ ఏర్పాటు పై ఎమ్మెల్యే జిఎంఆర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…
శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…