Telangana

గీతం పాలక మండలి సభ్యులుగా ఇద్దరు మహిళా నాయకులు

స్వాగతించిన గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ (గీతం) పాలక మండలి (గవర్నింగ్ బాడీ) సభ్యులుగా ఇద్దరు ప్రముఖ మహిళా నాయకులు జస్టిస్ కె.విజయలక్ష్మి, పద్మజ చుండూరు చేరినట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ వ్యూహాత్మక చర్య విశ్వవిద్యాలయం యొక్క వైవిధ్యం, మహిళా ప్రాతినిధ్యం, దాని నాయకత్వ నిర్మాణంలో చేర్చడం పట్ల అచంచలమైన నిబద్ధతను నొక్కి చెబుతోంది.

జస్టిస్ కె.విజయలక్ష్మి: ప్రముఖ న్యాయమూర్తి
జస్టిస్ కె.విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టులలో న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవంతో గీతం పాలక మండలిలో చేరారు. ఆమె విశిష్టమైన కెరీర్ లో రెండు రాష్ట్రాలలో ప్రభుత్వ న్యాయవాదిగా కూడా సేవలందించారు. మధ్యవర్తిత్వ వ్యవహారాలలో నిపుణురాలిగా ప్రసిద్ధి చెందిన జస్టిస్ లక్ష్మి, తన న్యాయపరమైన చతురతతో విశ్వవిద్యాలయ పాలనను గణనీయంగా మెరుగుపరచగలరని అభిలషిస్తున్నారు.

పద్మజ చుండూరు: ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణురాలు
పద్మజ చుండూరు మనదేశంతో పాటు అమెరికాలో కూడా ఆర్థిక సేవల రంగంలో 37 ఏళ్లకు పైగా విస్తృత అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఎన్ఎస్ డీఎల్, ఇండియన్ బ్యాంక్ వంటి గౌరవప్రదమైన సంస్థలలో క్రియాశీల భూమిక పోషించడంతో పాటు, ఆర్థిక వ్యవహారాలలో వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. డిజిటల్ బ్యాంకింగ్, కార్పొరేట్ గవర్నెన్స్, నాయకత్వంలో ఆమె లోతైన నైపుణ్యం గీతంకు అమూల్యమైనది.

జస్టిస్ లక్ష్మి, పద్మజలను పాలక మండలిలో చేర్చుకోవడం గీతం కమ్యూనిటీకి సాధికారత కల్పించే దిశగా ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తోంది. వారి నాయకత్వం, అంతర్దృష్టులు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిని వారి సంబంధిత రంగాలలో రాణించేలా ప్రేరేపిస్తాయని భావిస్తున్నారు.గవర్నింగ్ బాడీ సమావేశంలో కొత్త సభ్యులకు గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ ఘనస్వాగతం పలికారు. ‘జస్టిస్ లక్ష్మి, పద్మజలు బోర్డులో ఉండటం గౌరవంగా భావిస్తున్నాం. వారి ఉనికి నిస్సందేహంగా మా విశ్వవిద్యాలయం యొక్క నిర్ణయాత్మక ప్రక్రియను సుసంపన్నం చేస్తుంది. ప్రపంచ స్థాయి విద్యను అందించే మా మిషన్ కు దోహదం చేస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.విభిన్న దృక్కోణాలకు విలువనిచ్చే సమ్మిళిత వాతావరణాన్ని గీతం పెంపొందిస్తున్నందున, ఈ విశిష్ట నాయకుల చేరిక శ్రేష్ఠత వైపు దాని ప్రయాణంలో ఒక మైలురాయిని సూచిస్తోంది.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

12 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago