Telangana

గీతం పాలక మండలి సభ్యులుగా ఇద్దరు మహిళా నాయకులు

స్వాగతించిన గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ (గీతం) పాలక మండలి (గవర్నింగ్ బాడీ) సభ్యులుగా ఇద్దరు ప్రముఖ మహిళా నాయకులు జస్టిస్ కె.విజయలక్ష్మి, పద్మజ చుండూరు చేరినట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ వ్యూహాత్మక చర్య విశ్వవిద్యాలయం యొక్క వైవిధ్యం, మహిళా ప్రాతినిధ్యం, దాని నాయకత్వ నిర్మాణంలో చేర్చడం పట్ల అచంచలమైన నిబద్ధతను నొక్కి చెబుతోంది.

జస్టిస్ కె.విజయలక్ష్మి: ప్రముఖ న్యాయమూర్తి
జస్టిస్ కె.విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టులలో న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవంతో గీతం పాలక మండలిలో చేరారు. ఆమె విశిష్టమైన కెరీర్ లో రెండు రాష్ట్రాలలో ప్రభుత్వ న్యాయవాదిగా కూడా సేవలందించారు. మధ్యవర్తిత్వ వ్యవహారాలలో నిపుణురాలిగా ప్రసిద్ధి చెందిన జస్టిస్ లక్ష్మి, తన న్యాయపరమైన చతురతతో విశ్వవిద్యాలయ పాలనను గణనీయంగా మెరుగుపరచగలరని అభిలషిస్తున్నారు.

పద్మజ చుండూరు: ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణురాలు
పద్మజ చుండూరు మనదేశంతో పాటు అమెరికాలో కూడా ఆర్థిక సేవల రంగంలో 37 ఏళ్లకు పైగా విస్తృత అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఎన్ఎస్ డీఎల్, ఇండియన్ బ్యాంక్ వంటి గౌరవప్రదమైన సంస్థలలో క్రియాశీల భూమిక పోషించడంతో పాటు, ఆర్థిక వ్యవహారాలలో వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. డిజిటల్ బ్యాంకింగ్, కార్పొరేట్ గవర్నెన్స్, నాయకత్వంలో ఆమె లోతైన నైపుణ్యం గీతంకు అమూల్యమైనది.

జస్టిస్ లక్ష్మి, పద్మజలను పాలక మండలిలో చేర్చుకోవడం గీతం కమ్యూనిటీకి సాధికారత కల్పించే దిశగా ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తోంది. వారి నాయకత్వం, అంతర్దృష్టులు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిని వారి సంబంధిత రంగాలలో రాణించేలా ప్రేరేపిస్తాయని భావిస్తున్నారు.గవర్నింగ్ బాడీ సమావేశంలో కొత్త సభ్యులకు గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ ఘనస్వాగతం పలికారు. ‘జస్టిస్ లక్ష్మి, పద్మజలు బోర్డులో ఉండటం గౌరవంగా భావిస్తున్నాం. వారి ఉనికి నిస్సందేహంగా మా విశ్వవిద్యాలయం యొక్క నిర్ణయాత్మక ప్రక్రియను సుసంపన్నం చేస్తుంది. ప్రపంచ స్థాయి విద్యను అందించే మా మిషన్ కు దోహదం చేస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.విభిన్న దృక్కోణాలకు విలువనిచ్చే సమ్మిళిత వాతావరణాన్ని గీతం పెంపొందిస్తున్నందున, ఈ విశిష్ట నాయకుల చేరిక శ్రేష్ఠత వైపు దాని ప్రయాణంలో ఒక మైలురాయిని సూచిస్తోంది.

admin

Recent Posts

సివిల్ ఇంజనీరింగ్ లో అహ్మద్ మిన్హాజుద్దీన్ కు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

21 hours ago

ప్రజల నిర్ణయమే ఫైనల్

అమీన్పూర్ ఎస్టిపిని తరలిస్తాం లేదా రద్దు అవసరమైతే ముఖ్యమంత్రితో సైతం చర్చిస్తాము ఎస్టిపి ప్లాంట్ ఏర్పాటు పై ఎమ్మెల్యే జిఎంఆర్…

21 hours ago

ప్రతిభా ప్రదర్శన వేదికగా ‘సాధన-2026’

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…

2 days ago

పట్టభద్రులవుతున్న ఎన్.సీ.సీ. క్యాడెట్లకు ఘన వీడ్కోలు

శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :…

3 days ago

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల సమితి యువజన వికాస సమితి అధ్యక్షులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…

6 days ago

అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…

6 days ago