Telangana

నీలం మధుకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులను కలుపుకుని నీలం మధు కష్టపడి పని చేసినా తృటిలో సీటు ను చేజార్చుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.పార్లమెంట్ ఫలితాలు వెలువడిన సంధర్బంగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మంత్రివర్యులు కొండా సురేఖ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా ఓటమి పట్ల బెంగ పడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీలం మధు ను సముదాయించారు. విజయం దగ్గర దాకా వచ్చి చేజారిందని అంతమాత్రాన బాధపడాల్సిన పనిలేదన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెమటోడ్చి కష్టపడిన తృటిలో విజయం చేజారిందని తెలిపారు. ఓటమికి సంబంధించిన కారణాలను విశ్లేషణ చేసుకొని సమన్వయంతో ముందుకు వెళ్తూ ప్రజా పాలనలో పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని నీలం మధుకు సీఎం సూచించారు. నీలం మధు కు నేనున్నానని, కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago