మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షునిగా రెడ్యానాయక్ చెల్లదని పత్రికా ప్రకటన ను ఖండిస్తున్నామనీ నడిగడ్డ తాండ వాసులు తెలిపారు.నడిగడ్డ తాండ లో గిరిజన సంక్షేమ సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు మాత్రమే ఎన్నుకుంటారనీ, కొంతమంది తండా ఎన్నికల కమిటీ నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత గెలవమని ఉద్దేశంతో అందరు కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు గా రెడ్యా నాయక్ అధ్యక్షుడు అని తప్పుడు సమాచారంతో తాండ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తo చేశారు. తాండలో ఎవరు అతనికి ఏకీగ్రీవంగా తీర్మానం చేయలేదనీ, నడిగడ్డ తండాలో 800 కుటుంబాలు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకుంటారు ఎవరు వాళ్ళు ప్రకటించుకుంటే భవిష్యత్తులో ప్రజలు వాళ్లకు తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని ఎవరు ఇలా చేసినా సరైంది కాదని, తప్పుగా ఇచ్చిన పత్రిక ప్రకటనను తండా వాసులు ఇస్లావత్ దశరథ్ నాయక్, ఎస్ హన్మ నాయక్, ఎన్ దేవా నాయక్, నాయిని రత్న కుమార్, రమేష్ తేజవత్ బాలు నాయక్ , సోమేశ్ తదితరులు ఖండించారు.నడిగడ్డ తాండ నూతన అధ్యక్షునిగా తండా ఎన్నికల కమిటీ మాత్రమే అధికారికంగా ప్రకటన చేస్తుందనీ, ఎవరు పత్రిక ప్రకటన ఇచ్చిన పూర్తి విషయాలు తెలుసుకొని పత్రిక ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…