Telangana

గీతమ్ డిజిటల్ పరీక్షల అమలుపై కార్యశాల

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో జూన్ 1, 2024 డిజిటల్ హాజరు విధానం, డిజిటల్ పరీక్షల అమలుపై ఒకరోజు కార్యశాలను నిర్వహించారు. పరీక్షల ప్రక్రియలో పాత పద్ధతులను ఆధునీకరించడం, మానవ ప్రమేయాన్ని తగ్గించడం, విద్యార్థుల దుష్ప్రవర్తనను అరికట్టడం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు.ఈ కార్యశాలకు ముఖ్య అతిథిగా బెంగళూరు అదనపు ఉపకులసతి, క్యాట్స్ ఇన్ఛార్జి ప్రొఫెసర్ కె.ఎన్.ఎస్.ఆచార్య హాజరయ్యారు. వివిధ ఇంజనీరింగ్ విభాగాల అధిపతులు, హ్యుమానిటీస్, లీ-స్కూల్ డైరెక్టర్లు , స్కూల్ ఆఫ్ సెర్చ్ ఇన్చార్జి ప్రిన్సిపాల్, క్యాట్స్ బృందం, అతిథ్య విభాగం, పరీక్షల విభాగం, మానవ వనరుల విభాగాల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గీతం పరీక్షా ప్రక్రియ సంస్కరణలు, సామర్థ్యం, పారదర్శకతను పెంపొందించడానికి డిజిటల్ సాంకేతికతలను స్వీకరించడంపై వారు దృష్టి సారించారు.పరీక్షా ప్రక్రియ విధాన్నంతా పునర్ మూల్యాంకనం చేయడం, బయోమెట్రిక్ ద్వారా ప్రవేశం, క్యూఆర్ కోడ్ ప్రామాణీకరణ వంటి డిజిటల్ సాంకేతికతలను పరిచయం చేయడం, మానవ ప్రమేయాన్ని తగ్గించడం వంటిని వాటి సాధ్యాసాధ్యాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.డిజిటల్ కెమెరా పర్యవేక్షలో తరగతి గదులు, లెఫ్ట్ వీడియో ఫీడ్ ట్రాకింగ్, మొబైల్ యాప్ ఆధారిత మద్దతు: వంటి ప్రతిపాదిత డిజిటల్ సాంకేతికథలను అమలు చేయవలసి ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు.

ఈ సాంకేతికతలను వినియోగించి పరీక్షలో నిర్వహణ కోసం తరగతి గదుల కేటాయింపులను ఆటో మేట్ చేయడం, ఇన్విజిలేషన్ ప్రక్రియలను ట్రాక్చేయడం, జవాబుపత్రాలను సురక్షిత నిల్వ చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్నారు.అధ్యాపకులు విధులను ఆధునిక సాంకేతికత సాయంతో పర్యవేక్షించడం, హాజరును సులువుగా తీసుకోవ డంతో పాటు పరీక్షల సమయంలో దుర్వినియోగాలను నివారించడానికి డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తారు. ఈ సందర్భంగా సద్యులు లేవనెత్తిన సందేహాలకు ప్రొఫెసర్ కె.ఎన్.ఎస్. ఆచార్య తగిన జవాబులిచ్చి సమాధానపరిచారు.కార్యశాల చైర్ పర్సన్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య పర్యవేక్షణలో, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి సారథ్యంలో, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) జిగోపాలకృష్ణ సమన్వయంతో ఈ వర్కుషాప్ విజయవంతంగా ముగిసింది,డిజిటల్ టెక్నాలజీలను స్వీకరించడం ద్వారా పరీక్షా ప్రక్రియను మెరుగుపరచడానికి గీతం కట్టుబడి ఉందని ఈ కార్యశాల నిర్వహణ ద్వారా చాటిచెప్పారు.

 

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago