పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులను కలుపుకుని నీలం మధు కష్టపడి పని చేసినా తృటిలో సీటు ను చేజార్చుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.పార్లమెంట్ ఫలితాలు వెలువడిన సంధర్బంగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మంత్రివర్యులు కొండా సురేఖ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా ఓటమి పట్ల బెంగ పడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీలం మధు ను సముదాయించారు. విజయం దగ్గర దాకా వచ్చి చేజారిందని అంతమాత్రాన బాధపడాల్సిన పనిలేదన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెమటోడ్చి కష్టపడిన తృటిలో విజయం చేజారిందని తెలిపారు. ఓటమికి సంబంధించిన కారణాలను విశ్లేషణ చేసుకొని సమన్వయంతో ముందుకు వెళ్తూ ప్రజా పాలనలో పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని నీలం మధుకు సీఎం సూచించారు. నీలం మధు కు నేనున్నానని, కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…