అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నూతన దేవాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన

_అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్, కిష్టారెడ్డిపేట గ్రామాలలో నిర్మిస్తున్న ఫంక్షన్ హాళ్లు, దాయర నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులను ఆదేశించారు.అనంతరం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కె ఎస్ ఆర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక […]

Continue Reading

గీతం అధ్యాపకుడికి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ సెన్స్, ఫిజిక్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఐ.వి.సుబ్బారెడ్డికి ఏపీజే అబ్దుల్ కలాం బెస్ట్మ్ అచీవ్ మెంట్ (జీవితకాల సాఫల్య) అవార్డు వచ్చింది. బెంగళూరులోని సామాజిక, ఆర్ధికాభివృద్ధి జాతీయ విద్యా సంస్థ ఇటీవల ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డును ఇచ్చి సత్కరించినట్టు గీతం వర్గాలు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. దేశాభివృద్ధి, బోధన, పరిశోధన, పత్ర సమర్పణలో డాక్టర్ […]

Continue Reading

సీఎం కప్ వాలీబాల్ పోటీల్లో విజేతగా నిల్చిన ముకుందాపురం క్రీడాకారులు

_క్రీడాకారులను అభినందించిన పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : చీఫ్ మినిస్టర్ కప్ 2023 స్టేల్ లెవెల్ ఛాంపియన్ షిప్ వాలీబాల్ పోటీల్లో నల్గొండ టీం విజేతగా నిలిచింది. నల్గొండ జిల్లా టీం ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ముకుందాపురం క్రీడాకారులు కావడం విశేషం . క్రీడాకారులకు నల్గొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం పెట్టింది పేరని పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. క్రికెట్ ,కబడ్డీ, మారథాన్ ,వాలీబాల్ ఒక్కటేమిటి అన్నింటా […]

Continue Reading

వ్యాపారాభివృద్ధిలో కృత్రిమమేథది కీలక భూమిక’

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఉత్పత్తి అభివృద్ధి ప్రక్రియలను మెరుగుపరచడానికి, మార్కెట్ను వేగవంతం చేయడానికి, పోటీతత్వాన్ని పొందేందుకు స్టార్టప్లు కృత్రిమ మేథను వినియోగిస్తున్నాయని ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ప్రముఖ ఇన్నోవేటర్ చెత్తన్య ముప్పాల చెప్పారు. గీతం వర్సిటీలోని వెంచర్ డెవలప్ మెంట్ సెంటర్ (వీడీసీ) ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా, బుధవారం ఆయన ‘కృత్రిమ మేథ భవిత, ఉత్పత్తి అభివృద్ధి మెళకువలపై విద్యార్థులకు దిశానిర్దేశనం చేశారు. ఉత్పత్తి అభివృద్ధి భవిష్యత్తును అంచనా వేయడానికి బహుళజాతి కంపెనీలు […]

Continue Reading

కొల్లూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

రామచంద్రపురం,మనవార్తలు ప్రతినిధి : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న కొల్లూరు పోలీస్ స్టేషన్ భవనాన్ని మంగళవారం సాయంత్రం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. నూతన భవనం ఏర్పాటయ్యే వరకు.. తాత్కాలిక పోలీస్ స్టేషన్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో పోలీస్ స్టేషన్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నూతన పోలీస్ ఏర్పాటుతో తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, కొల్లూరు ప్రజలకు పోలీస్ […]

Continue Reading

కనీస వేతనాల సలహా మండలి బోర్డు చైర్మన్ ను అభినందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : బిఆర్ఎస్ పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ గా ఇటీవల నియమితులైన పులిమామిడి నారాయణ ను ఎమ్మెల్యే జిఎంఆర్ అభినందించారు. మంగళవారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పారిశ్రామిక రంగంలో […]

Continue Reading

మహమ్మద్ అబ్దుల్ రెహ్మాన్ ఉజెర్కు డాక్టరేట్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ సఫల్యంపై విశ్లేషణ, దానిని సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెద్దరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి (రీసెర్చ్ స్కాలర్) ముహమ్మద్ అబ్దుల్ రెహ్మాన్ ఉన్న డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, సహ పర్యవేక్షకుడు ప్రొఫెసర్ బి. బస్వరాజ్ లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని […]

Continue Reading

పదేళ్ల ప్రగతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టాలి..ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_దశాబ్ది ఉత్సవాల సంబరాలు అదిరిపోవాలి.. _ప్రతి కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించండి.. _ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యంతో కార్యక్రమాలు.. _నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పది సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన దశాబ్ది ఉత్సవాలలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ పదేళ్ల ప్రగతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టాలని పటాన్చెరు […]

Continue Reading

చిట్కుల్ గ్రామంలో అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన

పటాన్‌చెరు,,మనవార్తలు ప్రతినిధి : సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పల్లె ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో 9 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. […]

Continue Reading

సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,,మనవార్తలు ప్రతినిధి : నియోజకవర్గం లోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని హజ్రత్ సయ్యద్ మురాద్ అలీషా దర్గా, హజ్రత్ సయ్యద్ నిజాముద్దీన్ షా దర్గా, చోటా మసీద్ ప్రాంగణాల్లో 4 లక్షల 50 వేల రూపాయల సొంత నిధులతో ఏర్పాటుచేసిన 40 సీసీ కెమెరాలను సోమవారం స్థానిక నాయకులు, మైనార్టీ మత పెద్దలతో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. ఈ […]

Continue Reading