politics

సిఐటియు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ

సిగాచి ఘోర ప్రమాదానికి 6 నెలలు

సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఐడిఏ పాశమైలారం క్లస్టర్ కన్వీనర్ అతిమేల మానిక్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సీగాచి ఘోర ప్రమాదం జరిగి 54 మంది కార్మికులు బలైన ఘటనకు 6 నెలలు గడిచి పోయిందని, అయినా నేటికీ బాధితులకు కోటి రూపాయల నష్టపరిహారం పూర్తిగా అందలేదని, పెండింగ్ నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఐడిఏ పాశమైలారం ఇండస్ట్రియల్ క్లస్టర్ కన్వీనర్ అతిమేల మాణిక్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.సిగాచి పరిశ్రమ ఘోర ప్రమాదంలో 54 మంది కార్మికులు మృత్యువాత పడిన ఘటనకు 6నెలలు అయిన సందర్భంగా సోమవారం సాయంత్రం పాశమైలారం పారిశ్రామిక వాడలోని బిపిఎల్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ సిగాచి ఫార్మా పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి 54 మంది కార్మికులు మృతి చెంది ఆరు నెలలకు గడిచిన తర్వాత కంపెనీ సీఈవో అమిత్ రాజ్ సిన్హా ను అరెస్ట్ చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకున్నారని అన్నారు.

ఇప్పటికైనా యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం హర్షించదగిందని అన్నారు. కానీ బాధిత కుటుంబాలకు ప్రకటించిన కోటి రూపాయల నష్టపరిహారం నేటికీ పూర్తిగా ఇవ్వలేదని అన్నారు. పూర్తి నష్టపరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యం, అంత్యక్రియలకు అయిన ఖర్చులు చట్టబద్ధంగా కార్మిక కుటుంబాలకు రావాల్సిన డబ్బులు నష్టపరిహారంలో కలపొద్దని, అధికారులు వీటన్నిటిని కోటి రూపాయల్లో కల్పి చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదం నుండి బతికి బయటపడిన కార్మికులకు గత ఆరు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేయడంతోనే పూర్తిగా ఖాళీ బూడిదైనా డీఎన్ఏకు దొరకని 8 మంది బాధితులకు డెత్ సర్టిఫికెట్స్ ఇచ్చారని గుర్తు చేశారు. వారికి మిగతా పరిహారం వెంటనే ఇవ్వాలని, ఈ ఘోర ప్రమాదంపై జరిపిన విచారణ నివేదికను బహిర్గతం చేయాలన్నారు.

యాజమాన్యంపై చర్యలు తీసుకొని అరెస్టు చేసి జైలుకు పంపినంత మాత్రాన సరిపోదని పరిశ్రమల్లో ప్రమాదాలను అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజు నాయకులు వెంకటేష్, శేఖర్ రెడ్డి, ప్రవీణ్, సతీష్, శ్రీకాంత్, ప్రశాంత్ రెడ్డి, రాము, శ్రీనివాస్, చంద్రయ్య, ప్రభు, అన్నాజీ రావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago