Telangana

అర్థవంతమైన లక్ష్యాలను సాధించాలి యువతకు జేఎన్ యూ ప్రొఫెసర్ డాక్టర్ గుడవర్తి అజయ్ ఉద్బోధ

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నేటి తరం విద్యార్థులు అర్థవంతమైన లక్ష్యాలను సాధించాలని, సమాజానికి సృజనాత్మకంగా దోహదపడాలని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్ యూ)లోని రాజకీయ అధ్యయనాల కేంద్రం అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ రాజకీయ సిద్ధాంతకర్త, విశ్లేషకుడు డాక్టర్ అజయ్ గుడవర్తి సూచించారు.గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని రాజకీయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోమవారం ‘జెన్ జీ (నేటి యువత) – భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు’ అనే అంశంపై ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ప్రజాస్వామ్యంలో జెన్ జీ యొక్క ప్రమేయంపై సూక్ష్మ అవగాహనను అందించారు.

విలువలు, నీతి, రాజకీయ పద్ధతులలో వేగవంతమైన అంతర్గత మార్పులను డాక్టర్ అజయ్ ప్రముఖంగా ప్రస్తావించారు. జెన్ జీ రాడికల్ వ్యక్తిత్వం, సామాజిక ఉదాసీనతను ప్రదర్శిస్తున్నప్పటికీ, అది ఏకకాలంలో తక్కువ పక్షపాతంతో, మరింత సమ్మిళితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. సమకాలీన యువత నేతృత్వంలోని రాజకీయ ఉద్యమాలు ఎక్కువగా నాయకత్వం లేనివి, ఎపిసోడిక్ గా ఉన్నాయని, సామూహిక రాజకీయాల యొక్క సాంప్రదాయ భావనలను పునర్నిర్మించే సైద్ధాంతిక బోధన కంటే ఆదర్శప్రాయమైన చర్య ద్వారా నడపబడుతున్నాయని అన్నారు.జెన్ జీను వర్ణించే విశ్వాసం, ఆందోళన యొక్క వైరుధ్యాలను డాక్టర్ అజయ్ గుడవర్తి మరింత విపులీకరించారు.

దీనిని సరళీకరణ అనంతర యుగంలో కుంచించుకుపోతున్న ఆర్థిక అవకాశాలతో పాటు విస్తరించిన సామాజిక ప్రజాస్వామ్యానికి అనుసంధానించారు. నేటి యువత రాజకీయాలను రూపొందించడంలో గుర్తింపు, రాజకీయ ఆత్మాశ్రయత, వినియోగం యొక్క పెరుగుతున్న కలయికను కూడా ఆయన నొక్కి చెప్పారు. చివరగా విద్యార్థులు, పలువురు అధ్యాపకులతో ముఖాముఖి చర్చించి, వారి సందేహాలను నివృత్తి చేశారు.ఈ ఆతిథ్య ఉపన్యాస కార్యక్రమాన్ని సుప్రీ రంజన్ సమన్వయం చేశారు. జీఎస్ హెచ్ఎస్ ఇన్-ఛార్జి డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ తరు, డాక్టర్ మయాంక్ మిశ్రా, రిషిజా సింగ్, పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
.

admin

Recent Posts

రఘునాథ్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…

13 hours ago

గీతంలో ముగిసిన భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…

16 hours ago

కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం నుండి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టండి

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

1 day ago

డిఆర్డిఏ, మెప్మ, రెవెన్యూ, ఎక్సైజ్, హెచ్ఎండిఎ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష

మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…

1 day ago

నైపుణ్యాభివృద్ధికి గీతం పెద్దపీట

అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో విద్యార్థులకు మార్గనిర్దేశం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో విద్యార్థులకు…

1 day ago

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

2 days ago