దయారా జంగంకుంట ఆక్రమణల పై కఠిన చర్యలు
పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి,అమీన్పూర్ :
అమీన్పూర్ డివిజన్ పరిధిలోని గండిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామదేవతల ఆలయాలలో ఆగస్టు 30న ప్రతిష్టాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.మంగళవారం ఉదయం స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులతో కలిసి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ఆలయంలో దుర్గమ్మ, భూలక్ష్మమ్మ, చిత్తారమ్మ దేవతల విగ్రహాలను ప్రతిష్టించబోతున్నట్లు తెలిపారు. పనులు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. మరో రెండు వారాల్లో పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ పరిధిలోని జంగంకుంట పరిధిలో ఇటీవల కొందరు మట్టి నింపుతూ ఆక్రమణలకు పాల్పడడంపై ఎమ్మెల్యే జిఎంఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల దయారా గ్రామస్తులు ఈ అంశం పైన ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా మంగళవారం ఉదయం స్థానికులతో కలిసి కుంటను పరిశీలించారు. కుంటకు ఒక వైపు నుండి మట్టి నింపుతూ అక్రమించేందుకు ప్రయత్నించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్ తో ఫోన్ లో మాట్లాడి కుంటను ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కుంట పరిరక్షణకు సంపూర్ణ సహకారం అందిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు రాజు, భాస్కర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్…
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేజ్-02, 68వ బ్లాక్కు చెందిన దాసు ఆకస్మిక…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోని ప్రముఖ జ్యూవెలరీ సంస్థలు వినియోగదారుల కోసం ఒకే వేదికపై బంగారం, వజ్రాలు, ప్లాటినం,…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భవన నిర్మాణ రంగంలో ఇన్సూరెన్స్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నట్లు సిఐటియు…
బిస్లరి పరిశ్రమ కార్మికులు చెట్ల కొమ్మలు కట్టుకొని వినూత్నం నిరసన అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి ఈనెల 25న…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, నిర్వహణలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా…