మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. చెరువుల బఫర్ జోన్లు, ఎఫ్టిఎల్ పరిధిలోని స్థలాల ఆక్రమణకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు.మంగళవారం సాయంత్రం నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో గల పోచమ్మ కుంట, అమీన్పూర్ డివిజన్ పరిధిలోని దయారా పరిధిలోని జంగంకుంటల పరిధిలో చెరువు సరిహద్దులను నిర్ణయించి సుందరీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వడక్పల్లి గ్రామ చెరువు బఫర్ జోన్ పరిధిలో ప్రముఖ నిర్మాణ సంస్థ బఫర్ జోన్ ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించిందని స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగిందని.. వెంటనే దానిని తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తు తరాలకు నీటి వనరులను అందిస్తూ ప్రకృతి సమతుల్యతకు కీలకమైన చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని.. ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఈఈ భీమ్, డిఈ బాల గణేష్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేజ్-02, 68వ బ్లాక్కు చెందిన దాసు ఆకస్మిక…
దయారా జంగంకుంట ఆక్రమణల పై కఠిన చర్యలు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,అమీన్పూర్ :…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోని ప్రముఖ జ్యూవెలరీ సంస్థలు వినియోగదారుల కోసం ఒకే వేదికపై బంగారం, వజ్రాలు, ప్లాటినం,…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భవన నిర్మాణ రంగంలో ఇన్సూరెన్స్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నట్లు సిఐటియు…