Telangana

మౌళిక అంశాలపై పట్టు – ఉద్యోగానికి తొలి మెట్టు

ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన గూగుల్ ఇంజనీర్ రోహిత్ కీర్తాంకర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సాంకేతిక ఇంటర్వ్యూలలో విజయం సాధించడానికి డేటా నిర్మాణాల పనితీరుపై అవగాహనతో పాటు మౌళిక అంశాలపై పట్టు తప్పనిసరని గూగుల్ ఏడీఎస్ సొల్యూషన్స్ ఇంజనీర్ కీర్తాంకర్ స్పష్టీకరించారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘గూగుల్ స్పీకర్ సెషన్: జాబితా, మ్యాప్, O(1) మ్యాజిక్’ అనే అంశంపై మంగళవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. గీతంలోని గూగుల్ డెవలపర్ గ్రూప్ ఆన్ క్యాంపస్ (జీడీజీసీ) నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోహిత్ పనితీరు ఆధారిత ఇంజనీరింగ్, డేటా నిర్మాణాలపై లోతైన అవగాహన కల్పించారు.

సమయం, స్థల సంక్లిష్టత, సేకరణల ప్రాముఖ్యత, సరైన పనితీరును సాధించడానికి జాబితాలు, మ్యాపులు, సెట్ల ప్రభావవంతమైన ఉపయోగంపై రోహిత్ ప్రధానంగా దృష్టి సారించారు. బిగ్-ఓ సంజ్జామనం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, స్కేలబుల్ అప్లికేషన్లను నిర్మించడానికి మౌళిక అంశాలపై పట్టు సాధించాలన్నారు. ఆచరణాత్మక ఇంటర్వ్యూ వ్యూహాలను పంచుకున్నారు. విద్యార్థులు ప్రాథమిక పరిష్కారాలతో ప్రారంభించి, క్రమంగా వాటిని మెరుగుపరచాలని, తమ ఆలోచనా ప్రక్రియను స్పష్టంగా తెలియజేయాలని ప్రోత్సహించారు. ఇంటర్వ్యూ కోసం సన్నద్ధత, ప్లాట్ ఫామ్ ఆధారిత అభ్యాసం, వైఫల్యాల నుంచి నేర్చుకోవడంపై విద్యార్థులకు రోహిత్ మార్గదర్శనం చేశారు.జీడీజీసీ అధ్యక్షురాలు ఆశ్వికా ఖురానా, అతిథిని పరిచయం చేసి, ఇతర బృంద సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago