Telangana

సిగాచి పరిశ్రమ కార్మికుల కుటుంబాలకు పూర్తిస్థాయిలో నష్టపరిహారము చెల్లించాలి _సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సిగాచి పరిశ్రమ కార్మికుల కుటుంబాలకు పూర్తిస్థాయి నష్టపరిహారము చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయంలో సిగాచి పరిశ్రమలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ సిగాచి పరిశ్రమలో ఇప్పటివరకు 25 లక్షల నష్టపరిహారం మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. పరిశ్రమలో ప్రమాదం సంభవించి ఆరు నెలలు పూర్తవుతున్న ఇప్పటివరకు మిగతా 75 లక్షల నష్టపరిహారము ఎందుకు చెల్లించడం లేదని పరిశ్రమ యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరిశ్రమ యాజమాన్యాన్ని సీఈఓ అమిత్ రాజును అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం జరిగిందని, ఆరు నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల మాట గాలి మాటగా మారిందన్నారు. గత ఆరు నెలలుగా సీఐటీయూ ఆధ్వర్యంలో కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయం నుండి డెత్ సర్టిఫికెట్లు ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పూర్తిగా నష్టపరిహారం చెల్లించేంతవరకు కార్మికుల పక్షాన ఉండి సిఐటియు నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నల్లగండ్ల రాజు, కార్మికుల కుటుంబాలు పాల్గొన్నారు.
admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago