Hyderabad

గీతమ్ లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ కాగ్నెటివ్ ….

గీతమ్ లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ కాగ్నెటివ్ ….

– సిస్టమ్స్ 2021-22 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు

పటాన్ చెరు:

భారతీయ బహుళ జాతి కంపెనీ, ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సౌజన్యంతో గీతం డీమ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ సైన్స్ లో 2021-22 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ కాగ్నిటివ్ సిస్టమ్స్ ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్ని స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్నిపాల్ ప్రొఫెసర్ జీ.ఏ.రామారావు బుధవారం పేర్కొన్నారు. టీసీఎస్ సహకారంతో ప్రారంభిస్తున్న ఈ కోర్సులో విద్యార్థులు కోర్ కంప్యూటర్ సైన్స్ లోనే కాకుండా పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన జ్ఞానాన్ని పొందే వీలుందన్నారు. అంతే కాకుండా, కాగ్నిటివ్ కంప్యుటేషన్ స్కిల్స్ తో పాటు డిజైన్ థింకింగ్, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే నేర్పును అలవరచుకోవచ్చని తెలిపారు. ఐటీ / ఐటీ అనుబంధ సేవలు / ఐటీఐఎస్ కంపెనీలలో ఉత్పాదక వృత్తిని నెలకొల్పడానికి, ఉన్నత అధ్యయనాలకు దోహదపడతాయన్నారు. టీసీఎస్ తో కలిసి రూపొందించిన పాఠ్యాంశాల వల్ల విద్యార్థులు ప్రాక్టికల్ ల్యాబ్ అనుభవాలతో మిళితమైన ఐటీ మౌలిక సదుపాయాలతో కూడిన రంగాలను కూడా అర్థం చేసుకోవడానికి, సమగ్ర అవగాహన ఏర్పరచుకోవచ్చని ప్రిన్సిపాల్ వివరించారు. ఈ కోర్సులో భాగంగా పరిశ్రమ నిపుణులతో సమావేశాలు, సెమినార్లు, శిక్షణా సమావేశాలు, విశ్లేషణాత్మక నైపుణ్యాల పెంపు, జట్టులతో కలిసి పనిచేయడం, వ్యక్తిత్వ వికాసం వంటి అదనపు సౌకర్యాలు కూడా ఉంటాయన్నారు. ఇంటర్మీడియెట్ లేదా +2 ను (ఎంపీసీ) 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై, కంప్యూటర్ నైపుణ్యాలలో ప్రాథమిక జ్ఞానం ఉన్న విద్యార్థులు ఈ కోర్సులో చేరడానికి అర్హులని డాక్టర్ రామారావు తెలిపారు. ఇతర వివరాల కోసం 9000 688 872 లేదా hydgss.gitam.edu ను సందర్శించాలని ప్రిన్సిపాల్ సూచించారు.

Venu

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago