గీతమ్ లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ కాగ్నెటివ్ ….
– సిస్టమ్స్ 2021-22 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు
పటాన్ చెరు:
భారతీయ బహుళ జాతి కంపెనీ, ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సౌజన్యంతో గీతం డీమ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ సైన్స్ లో 2021-22 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ కాగ్నిటివ్ సిస్టమ్స్ ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్ని స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్నిపాల్ ప్రొఫెసర్ జీ.ఏ.రామారావు బుధవారం పేర్కొన్నారు. టీసీఎస్ సహకారంతో ప్రారంభిస్తున్న ఈ కోర్సులో విద్యార్థులు కోర్ కంప్యూటర్ సైన్స్ లోనే కాకుండా పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన జ్ఞానాన్ని పొందే వీలుందన్నారు. అంతే కాకుండా, కాగ్నిటివ్ కంప్యుటేషన్ స్కిల్స్ తో పాటు డిజైన్ థింకింగ్, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే నేర్పును అలవరచుకోవచ్చని తెలిపారు. ఐటీ / ఐటీ అనుబంధ సేవలు / ఐటీఐఎస్ కంపెనీలలో ఉత్పాదక వృత్తిని నెలకొల్పడానికి, ఉన్నత అధ్యయనాలకు దోహదపడతాయన్నారు. టీసీఎస్ తో కలిసి రూపొందించిన పాఠ్యాంశాల వల్ల విద్యార్థులు ప్రాక్టికల్ ల్యాబ్ అనుభవాలతో మిళితమైన ఐటీ మౌలిక సదుపాయాలతో కూడిన రంగాలను కూడా అర్థం చేసుకోవడానికి, సమగ్ర అవగాహన ఏర్పరచుకోవచ్చని ప్రిన్సిపాల్ వివరించారు. ఈ కోర్సులో భాగంగా పరిశ్రమ నిపుణులతో సమావేశాలు, సెమినార్లు, శిక్షణా సమావేశాలు, విశ్లేషణాత్మక నైపుణ్యాల పెంపు, జట్టులతో కలిసి పనిచేయడం, వ్యక్తిత్వ వికాసం వంటి అదనపు సౌకర్యాలు కూడా ఉంటాయన్నారు. ఇంటర్మీడియెట్ లేదా +2 ను (ఎంపీసీ) 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై, కంప్యూటర్ నైపుణ్యాలలో ప్రాథమిక జ్ఞానం ఉన్న విద్యార్థులు ఈ కోర్సులో చేరడానికి అర్హులని డాక్టర్ రామారావు తెలిపారు. ఇతర వివరాల కోసం 9000 688 872 లేదా hydgss.gitam.edu ను సందర్శించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…