Telangana

గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద చిన్నారులకు ఆపన్న హస్తం అందించిన బీఆర్ఎస్ యువనేత నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ వినూత్న కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి దూసుకువెళ్తున్నారు .ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందంటారు. అలాంటి మహాలక్ష్ములకు తన వంతుగా ప్రొత్సాహం అందిస్తున్నారు . తన గ్రామంలో పుట్టిన ప్రతి శిశువుకు ఐదు వేల రూపాయలు ఫిక్డ్స్ డిపాజిట్ చేసి..వారి భవిష్యత్ కు భరోసా కల్పిస్తున్నారు .గత ఏడాది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు జన్మదినంను పురస్కరించుకుని జూన్ 2 వతేదీ 2022 ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు .గత ఏడాది 22 మంది చిన్నారులకు ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఈ కార్యక్రమాన్ని నర్విరామంగా కొనసాగిస్తున్నారు. భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 50 మంది చిన్నారులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల ఫిక్డ్స్ డిపాజిట్ చేసి తన ఉదారత చాటుకున్నాడు . 50 మంది చిన్నారుల తల్లిదండ్రులకు ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను అందించారు .సీఎం కేసీఆర్ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడని గుర్తు చేశారు .ముఖ్యంగా కేసీఆర్ కిట్, ఆడ బిడ్డల పెళ్ళిళ్ళ కోసం కళ్యాణ లక్ష్మీ ,షాదీ ముబారక్ లాంటి పథకాలతో చేయూతనందిస్తున్నారు. మహిళ భద్రత కోసం షీ టీంలను ప్రవేశపెట్టి అన్నగా రక్షణ కల్పిస్తున్నాడని తెలిపారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

నేడు దేశ వ్యాప్తంగా కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని ,ఈ సమయంలో ప్రతి ఒక్కరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు . సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తన వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని నీలం మధు ముదిరాజ్ తెలిపారు. భవిష్యత్తులో తాను మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని…తనని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు,ఈ కార్యక్రమంలో పటాన్చెరు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపినాయుడు,MPHO కృష్ణాప్రసాద్,ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, కృష్ణ,భుజంగం,శ్రీను,మురళి, వెంకటేష్,రాజ్ కుమార్, యాదగిరి,ఆంజనేయులు, మాజీ PACS చైర్మెన్ నారాయణ రెడ్డి,బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు ప్రశాంత్,ANM వాణీ,గోపాల్,శ్రీను,అనిల్,నరేష్,వెంకటేశ్, ఆశ వర్కర్లు, మహిళలు, NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

8 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago