Telangana

జాతీయ సాహిత్య సంబరాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జిఎంఆర్ పిలుపు

_తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్య వికాసానికి

_కవి సమ్మేళనం దోహదం చేస్తుంది:

_పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెలుగు భాషాభివృద్ధికి సాహిత్య వికాసానికి కవి సమ్మేళనలు దోహదం చేస్తాయని పటాన్ చెరు శాసన సభ్యులు మాన్యశ్రీ గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలుగు వెలుగు సాహిత్య వేదిక,ఎస్ వీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సాహిత్య సంబరాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆరు రాష్ట్రాల నుంచి ఆరువందల మందికి పైగా కవులు పాల్గొనే జాతీయ సాహిత్య సంబరాలలో శతాధిక కవి సమ్మేళనం, ,, కవులకు, కళాకారులకు సత్కార కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ముఖ్యంగా తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్య వికాసానికి దోహదం చేసే విధంగా జాతీయ స్థాయిలో జరిగే సాహిత్య సంబరాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి తరలివచ్చే ,కవులకు, సాహితీ వేత్తలకు, కళాకారులకు సత్కారాలు ఉంటారని, ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే కవులు రచించిన పలు సాహిత్య పుస్తకాలు దాదాపు 50కి పైగా కవితా సంపుటి పుస్తకాలు ఆవిష్కరణలు జరుగుతాయని తెలిపారు.

పటాన్ చెరులోని జీహెచ్ఎంసీ మల్టిపర్ఫస్ ఫంక్షన్ హాల్ లో ఈనెల 30 వ తేదిన ఎస్ వీ ఫౌండేషన్, తెలుగు వెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించబోయే కవి సమ్మేళనానికి దేశంలోని ప్రధాన రాష్ట్రాలు మన తెలంగాణ తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల నుంచి తెలుగు కవులు విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమానికి స్ధానింగా కవులు, కళాకారులు,, ప్రజాప్రతినిధులు, ప్రజలు విచ్చేసి జాతీయ సాహిత్య సంబరాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. జాతీయ సాహిత్య సంబరాలలో భాగంగా పలు కార్యక్రమాలు ఉంటాయని వాటి వివరాలను వెల్లడించారు.

కార్యక్రమాలు ఇలా..

జాతీయ సాహిత్య సంబరాలలో భాగంగా
సాహిత్య ర్యాలీ : ఉదయం 8 గంటలకు పటాన్ చెరు లోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన 8:45 నిముషాలకు వేదిక వద్దకు చేరుకుంటుంది..

8:45 నిముషాలకు కవి సమ్మేళనం ప్రారంభ సభ
ఎమ్మెల్యే గారు. ఇతర సాహిత్య వేత్తలు జ్యోతి వెలిగింది ప్రారంబిస్తారు.
ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3: 45 గంటల వరకు జాతీయ కవి సమ్మేళనం జరుగుతుంది.
3:45 గంటల నుంచి 4గంటల వరకు సాంస్కృతిక ప్రదర్శనలు
4గంటలకు ముగింపు సభ

కవులకు పురస్కారాలు, పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమానికి స్ధానిక కవులు, రచయితలు, కళాకారులు,ప్రజలు,, ప్రతినిధులు విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, తెలుగు వెలుగు సాహిత్య వేదిక కవులు ట్యాగ్ లైన్ కింగ్ ఆలపాటి, సాదనాల వేంకట స్వామి నాయుడు, మోటూరి నారాయణరావు, జేవి కుమార్ చేపూరి, మేడిశెట్టి యోగేశ్వరరావు, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago