Telangana

వ్యర్థానికి విలువ ఇవ్వగలిగితే వృథా కాదు. డాక్టర్ శ్రీనివాస్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

వ్యర్థానికి జీవం పోయగలిగినా లేదా దానికి విలువ ఇవ్వగలిగినా, అది వృథా కాదని వాల్యూ అనేబర్ అండ్ సోషల్ ఇంపాక్ట్ ఔత్సాహిక సభ్యుడు డాక్టర్ శ్రీనివాస్ కేశవరపు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హెదరాబాద్, స్కూల్ ఆఫ్ సెు గురువారం ‘వెల్త్ అవుట్ ఆఫ్ నేస్ట్’ (చెత్త నుంచి సంపద) పేరిట సంయుక్తంగా నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, చెత్త నుంచి సంపద సృష్టిని పునరుత్పాదక ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకానమీ) అంటారని, వ్యర్థాల పునర్వినియోగం లేదా పునరుత్పాదకత చేయాలని ఆయన సూచించారు. మనంవ్యర్థం అనుకునే చాలా పదార్థాలు మరో ఉత్పత్తికి ముడిసరుకు అవుతాయన్నారు. ప్రతి పౌరుడూ వృథానుతగ్గించేందుకు ప్రయత్నించాలని, దానిని సంపదగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆహారాన్నివృథా చేయొద్దని ఆయన ఉద్బోధించారు. దాదాపు 99 శాతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పునర్వినియోగించవచ్చని,విలువైన మూలకాలను వాటిని నుంచి వెలికితీయొచ్చని డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు.

స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష్ సమన్వయంలో సాగిన బృంద చర్చలో రచయిత, వాల్యూ ఎనేబుల్ అండ్ సోషల్ ఇంపాక్ట్ ఔత్సాహికుడు వివేక్ వర్మ, ఎస్ సెషన్స్ వ్యవస్థాపకురాలు చిన్న హెగ్దేలు “వ్యవస్థాపకుడు, స్టార్టప్’ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్త స్టార్టప్తో సమానం కాదని, అయితే పారిశ్రామికవేత్తతో స్టార్టప్ సమానమన్నారు. సమస్యను గుర్తించి, దాని పరిష్కారం కోసం నిరంతం : ఆలోచించే మనస్తత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు ఉంటుందని, దానిని విద్యార్థులు అలవరచుకుంటే. వ్యవస్థాపకులుగా లేదా ఉన్నతోద్యోగులుగా ఎరిగొచ్చని వక్తలు స్పష్టీకరించారు. పారిశ్రామికవేత్త ఆలోచన వైఫల్యం. చెందడంలో తప్పులేదని, కానీ, దాని నుంచి విలువైన పాఠాలు నేర్చుకుని విజయవంతమైన జీవితానికి బాటలు వేసుకోగలగాలని వారు పేర్కొన్నారు.

తొలుత, బీ-స్కూల్ కేస్ స్టడీస్ డెరెక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్ బి. తన స్వాగతోపన్యాసంలో కార్యశాల లక్ష్యాలను వివరించి, అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేనేజిమెంట్, సెన్స్ అధ్యాపకులు, విద్యార్థులు పలువురు పాల్గొని, తను సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

5 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

5 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago