Telangana

వ్యర్థానికి విలువ ఇవ్వగలిగితే వృథా కాదు. డాక్టర్ శ్రీనివాస్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

వ్యర్థానికి జీవం పోయగలిగినా లేదా దానికి విలువ ఇవ్వగలిగినా, అది వృథా కాదని వాల్యూ అనేబర్ అండ్ సోషల్ ఇంపాక్ట్ ఔత్సాహిక సభ్యుడు డాక్టర్ శ్రీనివాస్ కేశవరపు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హెదరాబాద్, స్కూల్ ఆఫ్ సెు గురువారం ‘వెల్త్ అవుట్ ఆఫ్ నేస్ట్’ (చెత్త నుంచి సంపద) పేరిట సంయుక్తంగా నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, చెత్త నుంచి సంపద సృష్టిని పునరుత్పాదక ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకానమీ) అంటారని, వ్యర్థాల పునర్వినియోగం లేదా పునరుత్పాదకత చేయాలని ఆయన సూచించారు. మనంవ్యర్థం అనుకునే చాలా పదార్థాలు మరో ఉత్పత్తికి ముడిసరుకు అవుతాయన్నారు. ప్రతి పౌరుడూ వృథానుతగ్గించేందుకు ప్రయత్నించాలని, దానిని సంపదగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆహారాన్నివృథా చేయొద్దని ఆయన ఉద్బోధించారు. దాదాపు 99 శాతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పునర్వినియోగించవచ్చని,విలువైన మూలకాలను వాటిని నుంచి వెలికితీయొచ్చని డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు.

స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష్ సమన్వయంలో సాగిన బృంద చర్చలో రచయిత, వాల్యూ ఎనేబుల్ అండ్ సోషల్ ఇంపాక్ట్ ఔత్సాహికుడు వివేక్ వర్మ, ఎస్ సెషన్స్ వ్యవస్థాపకురాలు చిన్న హెగ్దేలు “వ్యవస్థాపకుడు, స్టార్టప్’ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్త స్టార్టప్తో సమానం కాదని, అయితే పారిశ్రామికవేత్తతో స్టార్టప్ సమానమన్నారు. సమస్యను గుర్తించి, దాని పరిష్కారం కోసం నిరంతం : ఆలోచించే మనస్తత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు ఉంటుందని, దానిని విద్యార్థులు అలవరచుకుంటే. వ్యవస్థాపకులుగా లేదా ఉన్నతోద్యోగులుగా ఎరిగొచ్చని వక్తలు స్పష్టీకరించారు. పారిశ్రామికవేత్త ఆలోచన వైఫల్యం. చెందడంలో తప్పులేదని, కానీ, దాని నుంచి విలువైన పాఠాలు నేర్చుకుని విజయవంతమైన జీవితానికి బాటలు వేసుకోగలగాలని వారు పేర్కొన్నారు.

తొలుత, బీ-స్కూల్ కేస్ స్టడీస్ డెరెక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్ బి. తన స్వాగతోపన్యాసంలో కార్యశాల లక్ష్యాలను వివరించి, అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేనేజిమెంట్, సెన్స్ అధ్యాపకులు, విద్యార్థులు పలువురు పాల్గొని, తను సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

10 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago