తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయాలకు పునర్వైభవం _ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్రంలో పురాతన ఆలయాల పునర్నిర్మాణంతో పాటు నూతన ఆలయాల నిర్మాణాలు, కల్యాణ మండపాల నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వం ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తున్నదని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాల నిర్మాణానికి, పునర్నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. టెంపుల్ టూరిజం కూడా పెద్దపీట వేస్తుందని నీలం మధు ముదిరాజ్ అన్నారు.అందోల్ నియోజకవర్గపరిధిలోని, అందోల్ మండలం మసానిపల్లి గ్రామంలో దేవాలయ కమిటీ చైర్మన్ పి నారాయణ ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి దేవాలయానికి నిర్వహించిన శంకుస్థాపనలో నీలం మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ దేవాలయం నిర్మాణానికి తన వంతు సహకారంగా 4 లక్షల రూపాయలు స్టీల్ అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. జాతరలు ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుండటంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణ చోటు చేసుకుటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పండుగలకు ప్రాధాన్యత కల్పించిందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మున్సిపల్ కౌన్సిలర్ పులిమామిడి రాజుగారు, సిద్దేశ్వర్,చాపల వెంకటేశం,నాగభూషణం, చింతల నర్సింలు, ఏరారం సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి,తాడు మనూరు సర్పంచ్ అనిల్ రెడ్డి, వివిధ గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు, ఎన్ఎమ్అర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *