శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :
రాబోయే రోజుల్లో బీజేపీ ని అధికారం లోకి రావడాని కార్యకర్తలoదరు కృషిచేయాలని బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ అన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్, రాఘవేంద్ర కాలనీ నుండి గజ్జల యోగానంద్ సమక్షంలో నియోజకవర్గ బిజేపి నాయకులు విద్యా కల్పన, ఏకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో రాఘవేందర్ రెడ్డి సింధు రెడ్డి నాయకత్వంలో 100 మందికి పైగా పార్టీ లో చేరిన వారికి గజ్జల యోగానంద్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండాపూర్ డివిజన్ నుండి పెద్ద ఎత్తున మహిళలు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు, మహిళలు ఈసారి బిజెపి పార్టీ నీ గెలిపించడంలో ముందుంటారని అన్నారు. ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి సింధు రెడ్డి లను యోగానంద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి కాంచన కృష్ణ, మహిళ నాయకురాలు పద్మారెడ్డి శోభా రెడ్డి డివిజన్ అధ్యక్షులు రాజిశెట్టి కురుమ, మేరీ సోలమన్, బీమని విజయలక్ష్మి, వినీత సింగ్, నియోజకవర్గ బిజెపి సీనియర్ నాయకులు భాను యాదవ్, జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు గణేష్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా సెక్రెటరీ అశోక్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…