Telangana

రేపటి సమాజ నిర్దేశకులుగా ఎదగండి – పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్

_డాక్టర్ అలీ ఫ్యాకల్టీ ఆఫ్ సివిల్ సర్వీసెస్

– అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న ఇష్టా విద్యాసంస్థలు

– ఇష్టా విద్యా సంస్థల చైర్మన్ కోట కార్తీక్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రేపటి తరాలకు పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే విద్య ఒక్కటే మార్గమని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ అలీ ఫ్యాకల్టీ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి అమీన్ పూర్ మండలం బీరంగూడలో గల బాలాజీ కన్వెన్షన్ హాల్లో ఇష్టా విద్యా సంస్థల చైర్మన్ కోట కార్తీక్ ఆధ్వర్యంలో జరిగిన ఐఐటి రామయ్య ఇష్టా విద్యాసంస్థల ఫేర్వెల్ పార్టీ సెలబ్రేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాట శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ అలీ ఫ్యాకల్టీ ఆఫ్ సివిల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ సివిఎన్ శాస్త్రీయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ… నేటి ఉరుకులు పరుగుల జీవితంలో తమ తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎంతో శ్రమకోర్చి చదివిస్తున్నారని దానికి అనుగుణంగా విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి భవిష్యత్ తరాలకు పదిమందికి ఉపాధి నిచ్చే విద్యావేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇష్టా విద్యాసంస్థలు ఐఐటి ఫౌండేషన్ / నీట్ ఫౌండేషన్ లక్ష్యంగా, ఈసీఐఎల్ లో మొట్టమొదటి ఐఐటి అకాడమీని 2012 లో ఎమ్మెల్సీ, ఐఐటి చుక్కారామయ్య ప్రారంభించిన ఇష్టా విద్యాసంస్థ 30 మంది విద్యార్థులతో మొదలై అనతి కాలంలోనే 43 ప్రయివేట్ పాఠశాలలకు ఐఐటి/నీట్ ఫౌండేషన్ కోర్సులను అందించడం అభినందనీయమన్నారు.

ఇష్టా విద్యా సంస్థల చైర్మన్ కోట కార్తీక్ మాట్లాడుతూ ఇష్టా సివిల్ సర్వీసెస్ అకాడమీ, ఇష్టా జూనియర్ కాలేజ్, ఇష్టా డిగ్రీ కాలేజి, ఇష్టా బిజినెస్ స్కూల్ లను ప్రారంభించి, మంచి విద్య బోధన అందిస్తూ ర్యాంకులతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నట్లు చెప్పారు. ఇష్టా సంస్థ యొక్క అవకాశాలను, అవసరాలను వినియోగిస్తున్న సమయంలో కోవిడ్ – 19 కరోనా భయంకరమైన మహమ్మారి దేశమంతుట విద్యాసంస్థలను విద్యార్థుల జీవితాలను ధ్వంసం చేసిందని, ఇష్టా విద్యాసంస్థలు సహా కరోనా ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, అయినా వెనుకంజ వేయకుండా ఆన్లైన్ విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందులు లేకుండా ఉపాధ్యాయ బృందాలను కుటుంబాలకు సహకారం అందించిందని, ఇదే సందర్భంలో విద్యార్థుల కుటుంబాలకు ఇష్ట నిర్వహిస్తున్న ప్రాంతాలలో 80కి పైగా బస్తీలలో, గ్రామాలలో ఆహారం, నిత్యవసర సరుకులు పంపిణీ చేసి మానవతా దృక్పథంతో సేవలు అందించాయన్నారు.

రెండు సంవత్సరాలు ఇష్టా విద్యాసంస్థలు సేవలు అందించి తమ లక్ష్యాన్ని సాధిస్తూ పురోగమనములో పయనిస్తూ విద్యార్థి లోకానికి దశ దిశను నిర్దేశిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసనిస్తూ ముందుకు సాగుతూ10 వసంతాలు పూర్తి చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇష్టా విద్యాసంస్థలు నేడు ఆంధ్రప్రదేశ్ లో 4 బ్రాంచ్ లు, తెలంగాణలో 7 బ్రాంచ్ లతో మొత్తం 11 బ్రాంచ్ లతో కార్పోరేట్ కి మించిన విద్యని అందిస్తూ ఎన్నో స్టేట్ ర్యాంకులు, ఐఐటీ, నీట్ ర్యాంకులు సాధించడం మా ఇష్టా విద్యా సంస్థలకే చెల్లిందన్నారు. ఈ సందర్భంగా ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆలరించాయి. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరస్పాండెట్స్ నాగరాజ్, జోసెఫ్, ప్రమోద్, అమరేందర్, రమేష్, దీప, విలియమ్స్, ప్రవీణ, ఇష్టా విద్యాసంస్థల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago